*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
వైజాగ్ గూగుల్ డేటా ఏఐ హబ్ పై బిజెపి చీఫ్ మాధవ్ ప్రెజెంటేషన్
*పి వి ఎన్ మాధవ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు*
విశాఖకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావడం శుభపరిణామం
ప్రపంచమంతా మాట్లాడుకునే ప్రత్యేక ప్రదేశంగా విశాఖ మారింది
విశాఖ గ్లోబల్ కేపిటల్ గా మారబోతుంది
అమెరికా వెలుపల పెద్ద మొత్తంలో విశాఖలో గూగుల్ పెట్టుబడులు పెడుతుంది
విశాఖ లో 1.3 లక్షల కోట్ల తో గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేస్తుంది
రాష్ట్రంలో సువిశాల సాగర తీరం అనేక అవకాశాలకు నిలయం
ప్రపంచంలో దిగ్గజ సంస్థలకు 40 శాతం సర్వీస్ ప్రొవైడర్లుగా తెలుగు వారు ఉన్నారు
విశాఖ కేంద్రంగా యువతకు మంచి అవకాశాలు రాబోతున్నాయి
రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పెట్టుబడులు పెద్ద మొత్తంలో వస్తున్నాయి
సెమి కండక్టర్స్ కు ఏపి కేపిటల్ గా మారబోతుంది
విశాఖ లో నూతన శకం ప్రారంభం కాబోతుంది
ఇప్పటికే సీపీ డేటా సెంటర్, ఓపెన్ కేబుల్ లాండింగ్ స్టేషన్ కు శంకుస్థాపన చేసుకున్నాం
ఏపీపై ప్రత్యేక శ్రద్ధ మోది తీసుకున్నారు
సవాళ్లను అధిగమిస్తూ లక్ష్యాన్ని పూర్తిచేసే దిశగా ముందు వెళ్తాం


