సర్పంచ్ల దారుణ ఆర్ధికం – 600 కుక్కల రక్తం!”
కామారెడ్డి, 14 జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో కొత్త సర్పంచ్ల దారుణ ఎంపిక వెలుగులోకి వచ్చింది. గ్రామాల్లో వీధి కుక్కల బెడదను తొలగించే ముం దుగా విష ప్రయోగం చేసి 600 కుక్కలు చంపేశా రు. ఈ మానవత్వ హత్యకు స్ట్రే ఆనిమల్స్ ఫౌండే షన్ ఫిర్యాదుతో ఐదుగురు సర్పంచ్లపై పోలీస్ కేసులు నమోదయ్యాయి.ఘటన స్థలాలు వివరా లు..భవానీపేట, ఫరీద్పేట, వాడి, పాల్వంచ, బండ రామేశ్వర్ పల్లి ఈ ఐదు గ్రామాల్లో కొత్త సర్పంచ్లు విషం కలిపిన ఆహారం పంచి కుక్కలను మట్టి చేశారు.గ్రామస్తులు కుక్కల సంఖ్య పెరగడంతో పిల్లలు, వృద్ధులు భయపడుతున్నారని చెప్పుకొ చ్చారు. కానీ ఇది చట్టవిరుద్ధం!ఫౌండేషన్ ప్రతిని ధులు మాచారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఆధారాలు సేకరించారు. చట్ట చర్యలు: సర్పంచ్లు టార్గెట్పోలీసులు Prevention of Cruelty to Animals Act 1960 సెక్షన్ 11 కింద కేసు దాఖ లు చేశారు. ఐదు గురు సర్పంచ్లు ఈ దారుణాం శంలో పాలుపంచుకున్నారు. విచారణ ఊరటన అదుపులో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి ఘట నలు పెరుగుతు న్నాయి.జిల్లా స్పందన, ఎన్జీఓల డిమాండ్ స్థానికులు: “కుక్కలు రోడ్ల మీద తిరుగు తుంటే ప్రమాదాలు జరుగుతాయి.అంటున్నారు. ఎన్జీఓ లు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్లు చేయా లి, విష ప్రయోగాలు ఆపాలి అని డిమాండ్ చేస్తు న్నారు.ఈ ఘటన జంతు హక్కులు, గ్రామీణ పాలనలో మానవత్వం చర్చలకు దారి తీసింది.


