విశాఖ లో జరుగుతున్న CII భాగస్వామ్య సదస్సు పై VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*
* సీఐఐ భాగస్వామ్య సదస్సు తో ప్రపంచమంతా విశాఖ వైపు చూస్తోంది – వి ఎం ఆర్ డి ఎ చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్
* విశాఖలో పెట్టుబడుల జాతర జరుగుతోంది.
* CII భాగస్వామ్య సదస్సు కి దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు తరలివచ్చారు
* రెండు రోజుల సదస్సులో కేవలం 410 ఒప్పందాలతో సుమారు 10 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. తద్వారా పెద్ద ఎత్తున యువత కి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
* సదస్సుకి ముందు రోజు విశాఖలో ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారు 5 రంగాల్లో 35 సంస్థ లతో 3.65 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకి ఒప్పందం కుదుర్చుకున్నారు. అలానే పలు సాఫ్ట్వేర్ సంస్థలకు, కార్పోరేట్ కంపెనీల కోసం శంకుస్థాపన కూడా చేశారు.
* పెట్టుబడిదారుల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తుంది.
* రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేస్తుండటంతో పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు బారులు తీరుతున్నారు.
* గత వైసీపీ ప్రభుత్వం హయంలో రాష్ట్రం లో కక్ష్య సాధింపు చర్యల కారణంగా అనేక సంస్థలు తరలిపోయాయి అనే కంటే తరిమికొట్టారనే చెప్పాలి.
* దీంతో రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ నారా లోకేష్ గారిపై ఉన్న నమ్మకం తో పాటూ దేశ, విదేశాల్లో పర్యటించి, పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరుపున అందించే అవకాశాలు, ఇతర రాయితీలు వివరిస్తూ, రాష్ట్రంలో ఉన్న వనరులు గురించి చెపుతూ పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని కలిగించారు.
* రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారు.
* అందువల్లే రాష్ట్రంలో పట్టుబడిదారులు రాష్టానికి తరలివస్తున్నారు.
* వీటిని ప్రపంచం గమనిస్తోంది. భవిష్యత్తులో ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో మరిన్ని పెట్టుబడులు రానున్నాయి.


