Thursday, 5 February 2026
  • Home  
  • విశాఖ డెయిరీకి రూ.1755 కోట్ల టర్నోవర్ – రూ.8.51 కోట్ల లాభం
- ఆంధ్రప్రదేశ్

విశాఖ డెయిరీకి రూ.1755 కోట్ల టర్నోవర్ – రూ.8.51 కోట్ల లాభం

విశాఖ డెయిరీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1755 కోట్ల టర్నోవర్‌తో రూ.8.51 కోట్ల నికర లాభాన్ని సాధించినట్టు చైర్మన్ ఎ. ఆనంద్‌కుమార్ ప్రకటించారు. బుధవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత సంవత్సరం డెయిరీ 19.28 కోట్ల లీటర్ల పాలు, 5.84 కోట్ల కిలోల పెరుగును విక్రయించింది. బిగ్‌బాస్కెట్, వాల్‌మార్ట్, మెట్రో, రిలయన్స్, డి-మార్ట్ తదితర సంస్థలతో పాటు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో డెయిరీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆర్మీకి 31.5 లక్షల లీటర్ల టెట్రా పాక్ పాలను సరఫరా చేశారు. విజయనగరం సోలార్ ప్లాంట్ 17.64 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు సరఫరా చేసింది. 3,700 సేకరణ కేంద్రాల ద్వారా 3 లక్షల మంది రైతుల నుండి 28 కోట్ల లీటర్లకు పైగా పాలు సేకరించారు. కొత్త ప్రాజెక్టులు, విస్తరణ అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 7 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు లీజుపై తీసుకున్నారు. 45 సొసైటీలకు మౌలిక వసతుల బలోపేతం కోసం NDDB రుణం, గ్రాంట్ మంజూరు చేసింది. కొత్త పశువుల దాణా ప్లాంట్ కోసం రూ.22.74 కోట్లు కేటాయించారు. బ్రాండ్ విజిబిలిటీ కోసం 300 ప్రత్యేక పార్లర్లు ఏర్పాటు చేస్తున్నారు. 23,000 మందికి శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం రూ.3.11 కోట్ల నిధులు 100% గ్రాంట్‌గా మంజూరు చేసింది. 2025-26 అంచనాకొత్త మార్కెట్లు, గ్రామీణ విస్తరణతో ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.2000 కోట్ల టర్నోవర్, రూ.20 కోట్ల లాభం సాధిస్తామని చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. జిఎస్టీ తగ్గింపుఈ నెల 22 నుండి 100 కంటే ఎక్కువ ఉత్పత్తులపై జిఎస్టీ తగ్గింపును అమలు చేసినట్టు ఆయన తెలిపారు.


విశాఖ డెయిరీ 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1755 కోట్ల టర్నోవర్‌తో రూ.8.51 కోట్ల నికర లాభాన్ని సాధించినట్టు చైర్మన్ ఎ. ఆనంద్‌కుమార్ ప్రకటించారు. బుధవారం జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.

గత సంవత్సరం డెయిరీ 19.28 కోట్ల లీటర్ల పాలు, 5.84 కోట్ల కిలోల పెరుగును విక్రయించింది. బిగ్‌బాస్కెట్, వాల్‌మార్ట్, మెట్రో, రిలయన్స్, డి-మార్ట్ తదితర సంస్థలతో పాటు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో డెయిరీ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఆర్మీకి 31.5 లక్షల లీటర్ల టెట్రా పాక్ పాలను సరఫరా చేశారు.

విజయనగరం సోలార్ ప్లాంట్ 17.64 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసి గ్రిడ్‌కు సరఫరా చేసింది. 3,700 సేకరణ కేంద్రాల ద్వారా 3 లక్షల మంది రైతుల నుండి 28 కోట్ల లీటర్లకు పైగా పాలు సేకరించారు.

కొత్త ప్రాజెక్టులు, విస్తరణ

అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 7 బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్లు లీజుపై తీసుకున్నారు.

45 సొసైటీలకు మౌలిక వసతుల బలోపేతం కోసం NDDB రుణం, గ్రాంట్ మంజూరు చేసింది.

కొత్త పశువుల దాణా ప్లాంట్ కోసం రూ.22.74 కోట్లు కేటాయించారు.

బ్రాండ్ విజిబిలిటీ కోసం 300 ప్రత్యేక పార్లర్లు ఏర్పాటు చేస్తున్నారు.

23,000 మందికి శిక్షణ ఇచ్చేందుకు కేంద్రం రూ.3.11 కోట్ల నిధులు 100% గ్రాంట్‌గా మంజూరు చేసింది.

2025-26 అంచనా
కొత్త మార్కెట్లు, గ్రామీణ విస్తరణతో ఈ ఆర్థిక సంవత్సరం (2025-26)లో రూ.2000 కోట్ల టర్నోవర్, రూ.20 కోట్ల లాభం సాధిస్తామని చైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు.

జిఎస్టీ తగ్గింపు
ఈ నెల 22 నుండి 100 కంటే ఎక్కువ ఉత్పత్తులపై జిఎస్టీ తగ్గింపును అమలు చేసినట్టు ఆయన తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.