బుధవారం విశాఖ ఉత్తర నియోజకవర్గం 50వార్డు మాధవధార 48a బస్ స్టాప్ దగ్గర ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ( రచ్చబండ) కోటి సంతకాల సేకరణ కార్యక్రమం 50 వార్డు కార్పొరేటర్ వావిలపల్లి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగింది. ఈకార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు,విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కె.కె రాజు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులు, మేధావులు,ప్రజలు వద్ద నుండి సంతకాలు స్వీకరించారు. ఈసందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ.. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాఆరోగ్యం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ దొంగ దెబ్బ కొట్టే విధంగా ప్రభుత్వ మెడికల్ కాలేజిలను ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేసే విధంగా ప్రజాభిప్రాయం లేకుండా ఒక కుట్రపూరిత నిర్ణయం ఈ కూటమి ప్రభుత్వం తీసుకుంది అని అన్నారు
ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రివర్యులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మహా ఉదృతంగా జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో 50వార్డు అధ్యక్షులు లాలంవేణు గోపాలస్వామి,అంబటి శైలేష్, వార్డు నాయకులు శివరాం, సనపల నారాయణస్వామి, పాతపట్నం రామ్మోహన్, పైడి శ్రీనివాసరావు, బగాది విజయ్ కుమార్, బగాది శ్రీరామ్ మూర్తి, దవళ నారాయణరావు,పైడి ప్రతాప్, పొన్నాడ అప్పారావు మాస్టర్, సబ్బవరపు శ్రీనివాస్, రేవతి, భవాని, చైతన్య, ప్రకాష్,వెంకటరావు, వెంకట్రావు సనపల రమేష్, పప్పల లక్ష్మణరావు, సీనియర్ నాయకులు అమర్ రెడ్డి, రత్నం,కె.చిన్న, బొట్ట రాజు, శ్యామ్, తదితరులు పాల్గొన్నారు..


