*విశాఖలో మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ కు మంత్రి లోకేష్ శంకుస్థాపన*
*విశాఖపట్నం * విశాఖపట్నం కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్ లో మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ (Motherson Technology Services Limited) ఐటీ సంస్థ క్యాంపస్ కు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని మంత్రి ఆవిష్కరించారు. మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ విశాఖ యూనిట్ ద్వారా రూ.109.73 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తద్వారా 1,775 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఈ కార్యక్రమంలో మదర్సన్ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ హెడ్ ఆఫ్ టెక్నాలజీ డివిజన్ ధీరజ్ ఇంద్ర ప్రకాష్, హెడ్ ఫైనాన్స్ కపిల్ బన్సల్, ఎంపీ శ్రీ భరత్, జిల్లా ఇంఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఏపీఐఐసీ ఛైర్మన్ మంతెన రామరాజు, ఐటీ సెక్రటరీ కాటంనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.


