*విశాఖపట్నం డిసెంబర్ 21పున్నమి ప్రతినిధి*
ఈరోజు విశాఖపట్నంలోని ప్రముఖ ప్రాంతాలలో విశాఖ పుస్తక మహోత్సవం ప్రచార కార్యక్రమాలు నిర్వహించాము.
ఈ సందర్భంగా విశాఖ ప్రజలకు విశాఖ పుస్తక మహోత్సవం లక్ష్యాలు, ఉద్దేశాలు వివరించాం.
ఈ పుస్తక మహోత్సవంలో
100కు పైగా ప్రచురణకర్తల పుస్తకాలు,
1 లక్షకు పైగా పుస్తక శీర్షికలు
ఒకే వేదికపై ప్రదర్శనకు రానున్నాయని తెలియజేశాం.
తెలుగు, ఇంగ్లీషు భాషల్లో సాహిత్యం, నవలలు, కథలు, కవిత్వం, చరిత్ర, విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, బాల సాహిత్యం, ప్రాచీనా గ్రంథాలు తదితర విభాగాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయని ప్రజలకు వివరించాం.
ప్రచార కార్యక్రమాలకు విశాఖ ప్రజలు సానుకూలంగా స్పందించారు. పుస్తక పఠనాన్ని ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు తరచుగా జరగాలని, సమాజానికి ఇవి ఎంతో అవసరమని పలువురు అభిప్రాయపడ్డారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ ప్రచార కార్యక్రమాల్లో
కిరణ్ – విజయవాడ బుక్ ఫెస్టివల్ కోఆర్డినేటర్,
భరత్ సాయి
పాల్గొన్నారు.


