వినాయక చవితి పర్వదినం సందర్భంగా అన్నమయ్య జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్. “గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలి. ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు సిద్ధించాలి” అని ఆయన ఆకాంక్షించారు.వేడుకలు, గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని కోరిన ఎస్పీ గారు, ప్రజలు పోలీసు విభాగం సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా పోలీసుల సూచనలుఅధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్ వాడకాన్ని పరిమితిలో ఉంచాలి.ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి.రహదారులపై వాహనాలను అడ్డంగా నిలపరాదు.
నిమజ్జన కార్యక్రమాల్లో పోలీసుల సూచనలు పాటించాలి.మద్యపానం చేసి వేడుకల్లో పాల్గొనరాదు.చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వినాయక చవితి వేడుకలు శాంతియుతంగా జరుపుకుందాం: ఎస్పీ విద్యాసాగర్ నాయుడు
వినాయక చవితి పర్వదినం సందర్భంగా అన్నమయ్య జిల్లా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యాసాగర్ నాయుడు, ఐపీఎస్. “గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధి దిశగా ముందుకు సాగాలి. ప్రజల జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు సిద్ధించాలి” అని ఆయన ఆకాంక్షించారు.వేడుకలు, గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరగాలని కోరిన ఎస్పీ గారు, ప్రజలు పోలీసు విభాగం సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా పోలీసుల సూచనలుఅధిక శబ్దం కలిగించే సౌండ్ సిస్టమ్స్ వాడకాన్ని పరిమితిలో ఉంచాలి.ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి.రహదారులపై వాహనాలను అడ్డంగా నిలపరాదు. నిమజ్జన కార్యక్రమాల్లో పోలీసుల సూచనలు పాటించాలి.మద్యపానం చేసి వేడుకల్లో పాల్గొనరాదు.చిన్నారులు, వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.సామాజిక మాధ్యమాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

