కడప ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల వినతిపత్రాలు స్వీకరించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి గారు
కడప ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించిన పలువురు ప్రజలు తమ వ్యక్తిగత, సామాజిక సమస్యలకు సంబంధించిన వినతిపత్రాలను ప్రభుత్వ విప్ & కడప ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డెప్పగారి మాధవి రెడ్డి గారికి అందజేశారు.
మాధవి రెడ్డి గారు వచ్చిన ప్రతి వినతిపత్రాన్ని పరిశీలించి, సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులకు తక్షణ దిశానిర్దేశం చేశారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, ప్రజల సమస్యల పరిష్కారాన్ని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ ముందుకు సాగుతానని మాధవి రెడ్డి గారు తెలిపారు.


