ఖమ్మం పున్నమి ప్రతినిధి
పాడి పంటలని ప్రోత్స హించడమే ప్రభుత్వ లక్ష్యం అని వ్యవసాయసహకార, మార్కెంటిగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావ్ అన్నారు. ఖమ్మం లోని విజయ డైరీ తనిఖీ చేసారు. ఈ సందర్భముగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లోమంత్రి మాట్లాడుతూ 50 ఎల్ల క్రితం విజయ డైరీ ప్రారంభం అయింది అని ప్రస్తుతం ఈ భవనం ని ఆధునికరించాలి అని అన్నారు. సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు ద్వారా విద్యుత్ కొనుగోలు చెయ్యాల్సిన అవసరం ఉండదు అన్నారు. నగర పాలక సం స్థ ద్వారా తాగునీటి సరఫరా కి ప్రతిపదనలు రూపొందించాలి అని అధికారులని ఆదేశించారు. డైరీ చుట్టూ పక్కల నుండి మురుగు నీరు లోపల కి వస్తుంది అని దీనికోసం దైవర్షన్ డ్రైన్, ప్రహరీ నిర్మించుకోవాలి అని సూచించారు. చిల్లింగ్ యూనిట్ల ఆధునికరణ కి చర్యలు తీసుకోవాలన్నారు. రాస్ట్రం లో పాడి ఉత్పత్తు లు తగ్గిపోవడం వల్ల ఇతర రాష్ట్ర లనుండి దిగుమతి చేసుకోవలసి వస్తుంది అని వివరించారు, యూరియా తో తయారు చేసే కల్తీ పాలు ఎక్కువ అవుతున్నాయి అని ఆందోళన వ్యక్తం చేసారు. తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ ఎండీ చంద్ర శేఖర్ రెడ్డి మాట్లాడుతూ విజయ డైరీ ద్వారా రోజు 5 లక్షల లీటర్ ల పాలు సేకరిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం ద్వారా పాడి రైతు ల కోసం అనేక సం క్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. కలెక్టర్ అనుదీప్ దూరి శెట్టి మాట్లాడుతు విజయ డైరీ సమస్య ల మీద అధికారూలతో సమీక్సిస్తాను అని చెప్పారు. మేయర్ పునకొల్లు నీరజ, అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ ఆగస్ట్యా, ఆర్డీఓ నర్సింహా రావు, డిడి రవికుమార్, మేనేజర్ మురళి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మిక్కిలి నేని నరేంద్ర తదితరులు ఉన్నారు


