పున్నమి న్యూస్ ప్రతినిధి కొవ్వూరు:(సెప్టెంబర్29)
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలంలోని కుమారదేవం వాటర్ ట్యాంక్ వీధిలో ప్రతిష్ఠించిన విజయదుర్గ అమ్మవారి మండపం వద్ద శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సరస్వతీ దేవి అవతారం ఎత్తిన అమ్మవారి దగ్గర విద్యార్థి విద్యార్థిని లచే పురోహితులు వెలవలపల్లి ప్రకాశం వారు సామూహిక సరస్వతీ దేవి పూజ జరిపించారు,తదనంతరం విద్యార్థుల చేత అక్షర పూజలు చేయించి,విద్యార్థులకు దాత బహుకరించిన పెన్నులు యిచ్చారు.


