అటల్ జయంతి వేడుకలు…
వింజమూరు మండలం బీజేపీ అధ్యక్షులు అంబటి ఈశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ ఆఫీస్ లో భారత్ రత్న,మాజీ ప్రధాని అటల్ బిహారి వాజపేయి 101 వ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. అణువణువునా దేశభక్తి…
కణకణమున హిందుత్వాను రక్తి…
ఎంత ఎత్తుకు ఎదిగినా నేలపైననే చూపు ఉండాలని కోరుకున్న సమున్నత జ్ఞానమూర్తి…తన మాటతో మంత్రముగ్ధుల్ని చేసిన అసామాన్య వచోధృతి…
తన తనువు, మనస్సు సర్వం భరతమాతకే అంకితం చేసిన త్యాగశీలి, అజాతశత్రువు, మాజీ ప్రధాని, భారతరత్నస్వర్గీయ అటల్ బిహారీ వాజ్ పేయి గారు భారత రాజకీయ యవనికపై అజాతశత్రువు, అపూర్వ వాగ్ధాటి కలిగిన కవి, దూరదృష్టి గల మహోన్నత నాయకుడు, భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజపేయి అటల్ జీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్న ‘సుపరిపాలన దినోత్సవం’ (Good Governance Day) . పారదర్శకమైన, జవాబుదారీతనం గల పాలనే ఆయనకు మనం ఇచ్చే నిజమైన నివాళి.భారతదేశ కీర్తిని దశదిశలా చాటిన రాజనీతిజ్ఞుడు, అణు పరీక్షలతో భారత్ సత్తాను ప్రపంచానికి చాటిన ధీశాలి అటల్ జీ. ఆయన ఆశయాలే మనకు మార్గదర్శకం. స్వర్ణ చతుర్భుజీ, గ్రామ సడక్ యోజన, దీపం పధకం, పొక్రాన్ అణు పరీక్షలు
ఈ కార్యక్రమం లో నాయకులు మల్లం కొండారెడ్డి, దాసరి ప్రసాద్, నాగేంద్ర, డి నారాయణ రెడ్డి, రాజ రమేష్, బీవీ సురేష్ ఇతర నాయకులు పాల్గొన్నారు


