Thursday, 19 March 2026
  • Home  
  • వాయులింగేశ్వర సన్నిధిలో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి
- తిరుపతి

వాయులింగేశ్వర సన్నిధిలో కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి

శ్రీకాళహస్తి, మార్చి 19 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తీశ్వరా స్వామీ, అమ్మవార్ల దర్శనార్దం కేంద్ర ప్రభుత్వ బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నాడు ఆలయానికి విచ్చేశారు. మంత్రిని ఆలయ కార్యనిర్వాహణాధికారి వెంకటేశులు, బీజేపీ నాయకులు కోలా ఆనంద్ దగ్గరుండి స్వాగతం పలికిన తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం అనంతరం మృతంజయ స్వామి సన్నిధిలో వేదపండితుల ఆశీర్వాదం పొందడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ…. లోక కళ్యాణార్థం కోసం, దేశ ప్రజల కోసం, ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మన దేశాన్ని సుభిక్షంగా కాపాడే నరేంద్ర మోదీ కోసం శ్రీకాళహస్తీశ్వరా స్వామీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరడమైనదని, తెలుగు ప్రజలకు శ్రీపరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలు మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, పాలకమండలి సభ్యురాలు కోలా వైశాలి, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, కార్యదర్శి కొండేటి గోపాల్, బీజేపీ సీనియర్ నేతలు కండ్రిగ ఉమా, జీవి అమర్నాథ్, ఆలయ అధికారులు విద్యా సాగర్ రెడ్డి, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తి, మార్చి 19 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తీశ్వరా స్వామీ, అమ్మవార్ల దర్శనార్దం కేంద్ర ప్రభుత్వ బొగ్గు, గనుల శాఖ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి గురువారం నాడు ఆలయానికి విచ్చేశారు. మంత్రిని ఆలయ కార్యనిర్వాహణాధికారి వెంకటేశులు, బీజేపీ నాయకులు కోలా ఆనంద్ దగ్గరుండి స్వాగతం పలికిన తర్వాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శనం అనంతరం మృతంజయ స్వామి సన్నిధిలో వేదపండితుల ఆశీర్వాదం పొందడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ…. లోక కళ్యాణార్థం కోసం, దేశ ప్రజల కోసం, ప్రపంచం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో మన దేశాన్ని సుభిక్షంగా కాపాడే నరేంద్ర మోదీ కోసం శ్రీకాళహస్తీశ్వరా స్వామీవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరడమైనదని, తెలుగు ప్రజలకు శ్రీపరాభవ నామ సంవత్సరం శుభాకాంక్షలు మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో టిటిడి పాలకమండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి, పాలకమండలి సభ్యురాలు కోలా వైశాలి, జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, కార్యదర్శి కొండేటి గోపాల్, బీజేపీ సీనియర్ నేతలు కండ్రిగ ఉమా, జీవి అమర్నాథ్, ఆలయ అధికారులు విద్యా సాగర్ రెడ్డి, మోహన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.