శ్రీకాళహస్తి అక్టోబర్ 23, పున్నమి న్యూస్: రాష్ట్రంలో పాలు జిల్లాల్లో గత ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జిల్లాలోని అనేక గిరిజన ప్రాంతాలలో ప్రజలు వారి దైనందిన జీవనానికి నష్టం కగడంతో అధికశాతం రోజువారి కూలీనాలీ చేస్తూ బ్రతికే పేదవారికి భృతి లేకుండా పోయిందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి తాలేటి రామచంద్రయ్య ప్రకటనలో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలను గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు, గిరిజనులకు తక్షణసాయంగా 10.000 రూపాయలు ఇవ్వాలని, వాటితో పాటు ప్రతి కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పేదల గుడిసెలను తిరిగి నిర్మించుకునేందుకు సాయం అందించాలనీ, అందుకోసం జిల్లాలోని మండల తహసిల్దార్ నేతృత్వంలో సమగ్ర సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు.

వర్షాలకు ఉపాధి కోల్పోయిన వారికి తక్షణ సాయం అందించాలి-తాలేటి రామచంద్రయ్య
శ్రీకాళహస్తి అక్టోబర్ 23, పున్నమి న్యూస్: రాష్ట్రంలో పాలు జిల్లాల్లో గత ఐదు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షాల కారణంగా జిల్లాలోని అనేక గిరిజన ప్రాంతాలలో ప్రజలు వారి దైనందిన జీవనానికి నష్టం కగడంతో అధికశాతం రోజువారి కూలీనాలీ చేస్తూ బ్రతికే పేదవారికి భృతి లేకుండా పోయిందని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కార్యదర్శి తాలేటి రామచంద్రయ్య ప్రకటనలో ద్వారా తన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. వర్షాల కారణంగా ఉపాధి కోల్పోయిన నిరుపేదలను గిరిజనులను ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఉపాధి కోల్పోయిన నిరుపేదలకు, గిరిజనులకు తక్షణసాయంగా 10.000 రూపాయలు ఇవ్వాలని, వాటితో పాటు ప్రతి కుటుంబానికి బియ్యం, నిత్యావసర సరుకులు అందించాలని కోరారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న పేదల గుడిసెలను తిరిగి నిర్మించుకునేందుకు సాయం అందించాలనీ, అందుకోసం జిల్లాలోని మండల తహసిల్దార్ నేతృత్వంలో సమగ్ర సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు.

