– రైతులకు అండగా కాంగ్రెస్ నాయకులు
కామారెడ్డి 29 అక్టోబర్పు,( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా, ఉప్పల్వాయి, రామారెడ్డి కేంద్రాల పరిశీలన.. తుఫాన్ ప్రభావంతో ఇబ్బందులు ఎదు ర్కొంటున్న సంధర్బంలో కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పోలీసులు, అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళ గా, వెంటనే స్పందించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టిన కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్కు జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నా రెడ్డి మోహన్ రెడ్డి కృతజ్ఞత లు తెలిపారు.తాజాగా తుఫాన్ ప్రభావంతో వరి కాళ్లాలు తడిసి రైతులు కష్టాలు పడుతున్న విష యం తెలుసుకున్న మోహన్ రెడ్డి, మండలంలోని ఉప్పల్వాయి, రామారెడ్డి వంటి కొనుగోలు కేంద్రా లను స్వయంగా సందర్శించి, రైతులతో మాట్లాడా రు. వారికెదురవుతున్న సమస్యలను వివరించి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతుల ఇబ్బందు లను గమనించిన కలెక్టర్ మంగళవారం తక్షణమే వివిధ కొనుగోలు కేంద్రాలను సందర్శించి, వరి నిల్వ, తడిసిన ధాన్యం ఎండబెట్టడం, తరలింపు వంటి అంశాలపై అధికారులకి ప్రత్యక్ష ఆదేశాలు జారీ చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.మాజీ ఫ్లోర్ లీడర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సత్వరంగా స్పందించడం అభినందనీయ మైన విషయం. ఈ సమయంలో కాంగ్రెస్ శ్రేణులు రైతులకు అండగా ఉండి, వారిని ఆదుకోవడం, వారి సమస్యలను ప్రజా ప్రతినిధుల, అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమయానికి పరిష్కారాలు సాధిం చేందుకు కృషి చేయడం మనందరి బాధ్యత” అని అన్నారు.రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా స్థాయిలో అధికార యంత్రాంగం వేగంగా కదిలిం దని ఆయన అభినందించారు. తుఫాన్ ప్రభావం తో నష్టపోయిన రైతులకు సాయం అందించే దిశగా ప్రభుత్వం ముందుకురావాలని మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.


