పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి తెలంగాణ ప్రతి నిధి)
తెలంగాణ లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జరిగిన నష్టం ని అంచనా వేసి రైతుల పక్షం న పోరాటం చేసేందుకు
ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు బిజెపి నేతలు సిద్ధం అయ్యారు.
భారీ వర్షాల కారణంగా పంటలు, ఆస్తులు నష్టపోయిన రైతులు, పేద ప్రజలకు అండగా నిలవడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు నేడు సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నారు. అదే విధంగా వరంగల్లో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బసవ లక్ష్మీ నరసయ్య, మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ తదితరులు పర్యటించి వరద ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించనున్నారు.


