Sunday, 7 December 2025
  • Home  
  • వచ్చే ఏడాది మార్చి వరకు సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు సర్వీసులు పొడిగింపు* ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి
- కాకినాడ

వచ్చే ఏడాది మార్చి వరకు సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు సర్వీసులు పొడిగింపు* ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ వెల్లడి

కాకినాడ, సెప్టెంబర్ 4: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాకినాడ – సికింద్రాబాద్ ల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులను వచ్చే ఏడాది మర్చి వరకు పొడిగించడంతో పాటు అదనంగా మరో ప్రత్యేక రైలు సర్వీస్ ని కేటాయించినట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజల విజ్ఞప్తి మేరకు సికింద్రాబాద్ కు నడుస్తున్న ప్రత్యేక రైల్వే సర్వీస్ లను మరికొంత కాలం పొడిగించాలని కోరుతూ ఈ ఏడాది జూన్ 19 న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు లేఖ రాయడం జరిగిందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు ప్రస్తుతం వారానికి మూడు రోజులు కాకినాడ నుండి లింగంపల్లి వరకు నడుస్తున్న ప్రత్యేక రైలు తో పాటు అదనంగా ప్రతి శనివారం కాకినాడ నుండి చర్లపల్లికి ప్రత్యేక రైలు సర్వీస్ ను కేటాయించినట్టు తెలిపారు. ఈ రెండు ప్రత్యేక రైలు సర్వీసులు వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగుతాయన్నారు. దీనికి సంబంధించి రైల్వే శాఖ అధికారుల నుండి సమాచారం వచ్చిందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కోరారు.

కాకినాడ, సెప్టెంబర్ 4: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాకినాడ – సికింద్రాబాద్ ల మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలు సర్వీసులను వచ్చే ఏడాది మర్చి వరకు పొడిగించడంతో పాటు అదనంగా మరో ప్రత్యేక రైలు సర్వీస్ ని కేటాయించినట్లు కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ వెల్లడించారు. గురువారం కాకినాడలో ఆయన మాట్లాడుతూ కాకినాడ పరిసర ప్రాంతాల ప్రజల విజ్ఞప్తి మేరకు సికింద్రాబాద్ కు నడుస్తున్న ప్రత్యేక రైల్వే సర్వీస్ లను మరికొంత కాలం పొడిగించాలని కోరుతూ ఈ ఏడాది జూన్ 19 న దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు లేఖ రాయడం జరిగిందన్నారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు ప్రస్తుతం వారానికి మూడు రోజులు కాకినాడ నుండి లింగంపల్లి వరకు నడుస్తున్న ప్రత్యేక రైలు తో పాటు అదనంగా ప్రతి శనివారం కాకినాడ నుండి చర్లపల్లికి ప్రత్యేక రైలు సర్వీస్ ను కేటాయించినట్టు తెలిపారు. ఈ రెండు ప్రత్యేక రైలు సర్వీసులు వచ్చే ఏడాది మార్చి వరకు కొనసాగుతాయన్నారు. దీనికి సంబంధించి రైల్వే శాఖ అధికారుల నుండి సమాచారం వచ్చిందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.