“లోకో రన్నింగ్ సిబ్బంది 48 గంటల నిరాహార దీక్ష విజయవంతంగా ముగిసింది”
*విశాఖపట్నం డిసెంబర్ 4 పున్నమి ప్రతినిధి:-*
అఖిల భారత లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ (AILRSA) కేంద్ర వర్కింగ్ కమిటీ నిర్ణయం మేరకు, లోకో రన్నింగ్ సిబ్బంది తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా 02-12-2025 ఉదయం 10 గంటల నుండి 04-12-2025 ఉదయం 10 గంటల వరకు 48 గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని క్రూ లాబీలు, డీఆర్ఎం కార్యాలయాల ఎదుట నిర్వహించారు.
అదేవిధంగా వాల్తేరు డివిజన్లో డీఆర్ఎం కార్యాలయం, వాల్తేరు వద్ద ఈ నిరాహార దీక్ష కార్యక్రమం జరిగింది. రన్నింగ్ సిబ్బంది రైళ్ల విధుల్లో పాల్గొంటూ “నేను 48 గంటల నిరాహార దీక్షలో ఉన్నాను” అనే బ్యాడ్జీలు ధరించి 04-12-2025 ఉదయం 10 గంటల వరకు నిరాహార దీక్షను కొనసాగించారు.
ప్రధాన డిమాండ్లు:
1. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్స్ను వెంటనే ఉపసంహరించాలి.
2. 01-01-2024 నుండి TA రేట్లు పెరిగిన తరహాలో కిలోమీటరేజ్ భత్యాన్ని 25% పెంచాలి.
3. కిలోమీటరేజ్ అలవెన్సులో 70%ను ఆదాయపు పన్ను నుండి మినహాయించాలి.
4. ALP భర్తీ ప్రక్రియ (RRB–2025) మరియు శిక్షణ ప్రక్రియ (RRB–2024)ను వేగవంతం చేయాలి.
5. రన్నింగ్ స్టాఫ్ టర్న్ అరౌండ్ / హెడ్క్వార్టర్స్ అబ్సెన్స్ 48 గంటల లోపు ఉండేలా చేసి, దానిని మరింతగా 36 గంటలకు తగ్గించాలి.
6. క్రూ నైట్ డ్యూటీని వరుసగా రెండురాత్రులకే పరిమితం చేయాలి.
7. సిబ్బంది దీర్ఘకాల పని గంటలను నిలిపివేసి, సైనింగ్ ఆన్ నుండి సైనింగ్ ఆఫ్ వరకు గరిష్టంగా 10 గంటలకే పరిమితం చేసి, దానిని 8 గంటలకు తగ్గించాలి.
8. పీరియాడికల్ రెస్ట్ 16+30 గంటలు అంటే మొత్తం 46 గంటలు తప్పనిసరిగా అమలు చేయాలి.
9. లోకో క్యాబ్లలో టూల్ బాక్స్ మరియు FSD సదుపాయం ఏర్పాటు చేయాలి.
వాల్తేరు డివిజన్లో లోకో రన్నింగ్ సిబ్బంది స్థానిక సమస్యలు:
• లోకో పైలట్లను 12 గంటల డ్యూటీకి బలవంతంగా వినియోగించడం, అలాగే 16 గంటల విశ్రాంతికి బదులుగా కేవలం 12 గంటల ట్రిప్ రెస్ట్ మాత్రమే ఇవ్వడం తక్షణం నిలిపివేయాలి.
• సింహాచలం నార్త్, విజయనగరం వద్ద హెడ్క్వార్టర్స్ లేదా రిలీఫ్ పాయింట్లను అండర్ యుటిలైజేషన్, యార్డ్ కాంగెషన్ పేరుతో బైపాస్ చేయడం నిలిపివేయాలి.
• DPWCS (లోటస్) లోకో పేరిట అసిస్టెంట్ లోకో పైలట్ లేకుండా లోకో పైలట్ను పని చేయమని బలవంతం చేయడం ఆపాలి.
• లోకో పైలట్తో కలిసి పని చేసిన తర్వాత అసిస్టెంట్ లోకో పైలట్కు రిలీవ్ ఇవ్వకుండా వివక్ష చూపడం ఆపాలి.
• సైడింగ్స్ నుండి GDR చెక్స్ లేకుండా, TXR సిబ్బంది పరీక్ష లేకుండా లాంగ్ హాల్ రైళ్లను క్లియర్ చేయడం నిలిపివేయాలి.
• ఒకే ట్రైన్ ఆర్డర్లో బహుళ రైళ్లను నడపమని సిబ్బందిపై ఒత్తిడి చేయడం ఆపాలి.
• పూర్తిగా అసురక్షితమైన K.K లైన్లో డౌన్లోడెడ్ లాంగ్ హాల్ రైళ్లను నడపడం నిలిపివేయాలి.
• MIPM, SCMN, VZM అవుట్ స్టేషన్ సిబ్బందిని PSA & RGDA వద్ద విశ్రాంతి తీసుకున్న తర్వాత షార్ట్ ట్రిప్స్ లేదా షటిల్ ట్రైన్లకు వినియోగించడం వల్ల హెడ్క్వార్టర్స్ నుంచి ఎక్కువగా దూరమవుతున్నారు – ఇది నిలిపివేయాలి.
• డ్యూటీ గంటల కుదింపు, విడగొట్టడం పూర్తిగా ఆపాలి.
• అన్ని హ్యాండిక్యాప్డ్ సెక్షన్లలో కనీస గ్యారంటీ కిలోమీటర్ అలవెన్స్ 120 కిలోమీటర్లు ఇవ్వాలి.
• RGDA రన్నింగ్ రూమ్లో కాంట్రాక్టర్కు మేలు చేసే విధంగా ప్రవేశపెట్టిన ఫిక్స్డ్ మీల్స్ సిస్టమ్ను వెంటనే రద్దు చేయాలి.
ఈ సందర్భంలో, ఒక మెమోరాండం గౌరవ భారత రైల్వే మంత్రి గారికి, రైల్వే బోర్డు చైర్మన్ గారికి న్యూఢిల్లీకి పంపబడింది. మరో మెమోరాండం స్థానిక సమస్యలపై డీఆర్ఎం–వాల్తేరు గారికి సమర్పించబడింది.
ఈ కార్యక్రమానికి అఖిల భారత స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ డివిజనల్ సెక్రటరీ శ్రీ పాణికుమార్, అఖిల భారత గార్డ్స్ కౌన్సిల్ డివిజనల్ సెక్రటరీ శ్రీ వర్మ, ఈ.కో.ఆర్.ఎస్.యూ జనరల్ సెక్రటరీ శ్రీ ఆర్.సి.సాహో, జోనల్ ప్రెసిడెంట్ శ్రీ సంపత్ తదితరులు సంఘీభావం ప్రకటిస్తూ మాట్లాడారు.
AILRSA జోనల్ ప్రెసిడెంట్ శ్రీ ఎస్.కె. హూబే, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ వి.ఎస్.వి.బి. రాజు దీక్ష ముగింపు సభలో ప్రసంగించి, అన్ని డిమాండ్ల సాధన కోసం ఐక్య పోరాటాలు అవసరమని పిలుపునిచ్చారు.
విశాఖపట్టణ యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ, CITU విశాఖ జిల్లా వైస్ ప్రెసిడెంట్ శ్రీ జగన్ మాట్లాడుతూ, ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ, 21-12-2025 నుండి 4 లేబర్ కోడ్స్ అమలు చేయడం, లోకో రన్నింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించకపోవడం, ఖాళీలను భర్తీ చేయకపోవడం వంటి అంశాలను తీవ్రంగా విమర్శించారు. ఐక్య పోరాటాలకు పిలుపునిచ్చారు. 48 గంటల నిరాహార దీక్షను విజయవంతంగా పూర్తి చేసిన సిబ్బందిని అభినందిస్తూ వారికి నిమ్మరసం అందించి కార్యక్రమాన్ని ముగించారు.
ఈ కార్యక్రమం శ్రీ ఎస్.సి. పాణిగ్రాహి (డివిజనల్ ప్రెసిడెంట్), బివి.ఎస్.వి. రాజు (సెంట్రల్ జాయింట్ సెక్రటరీ), హరికృష్ణ (జాయింట్ డివిజనల్ సెక్రటరీ), ఎం. చిన్నోడు (AILRSA, వాల్తేరు) నాయకత్వంలో నిర్వహించబడింది.


