
విశాఖపట్నం, సెప్టెంబర్ 18: జీవీఎంసీ పరిధిలో రెండవ దశ బార్ నోటిఫికేషన్ కు ఈరోజు నగరంలో డ్రా జరిగింది. జాయింట్ కలెక్టర్ శ్రీ మయూరి అశోక్ గారు 11 బార్లకు డ్రా తీసి అర్హులను నిర్ణయించారు. 2025 – 2028 సంవత్సరాల కు గాను విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వం 121 బార్లకు ఓపెన్ క్యాటగిరిలో గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. వీటిలో గత నెల 30 న జరిగిన డ్రాలో 58 బార్లకు లైసెన్స్ జారీ చేయడం జరిగింది. మిగిలిన 63 బార్లకు రెండవ దశలో నోటిఫికేషన్ జారీ చేయగా 11 బార్లకు 44 అప్లికేషన్ రావడం జరిగింది. అభ్యర్థుల సమక్షంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ లాటరీ నిర్వహించి సెలెక్ట్ అయిన అభ్యర్థులను ప్రకటించారు. వారు ప్రభుత్వ నిర్ణయించిన రిటైల్ ఎక్సైజ్ టాక్స్ కట్టిన తర్వాత బార్లు ప్రారంభించుకోవచ్చని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీ రామచంద్ర మూర్తి గారు, ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్. ప్రసాద్ తెలిపారు.

