Wednesday, 30 July 2025
  • Home  
  • లబ్ధిదారుల నోట్లో మట్టి కొడుతున్నారు
- Featured

లబ్ధిదారుల నోట్లో మట్టి కొడుతున్నారు

పలమనేరు, జూన్3,2020(పున్నమి విలేకరి): ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకొంటూ,నాణ్యమైన ఇసుక కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరను మీసేవ ఆన్ లైన్ లో చెల్లించి నిబంధనలను పాటిస్తున్న లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టి చేతులు దులుపుకుంటున్నారు కొందరు అధికారులు..పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం గండ్రాజుపల్లెకు చెందిన బత్తి గౌడ్ కుమారుడు భానుచందర్ మే నెల 30వ తేదీన ఆన్ లైన్ ద్వారా ఇసుకకు డబ్బులు చెల్లించాడు. ఈ రోజు శంకర్ రాయల్ పేట రీచ్ నుండి ట్రాక్టర్ ద్వారా పంపిణీ చేశారు. ఇసుక కి బదులుగా బంకమట్టి, మట్టిని తోలారు. డ్రైవర్ ని ప్రశ్నించగా ఇసుక రీచ్ నుండి ఇదే ఇవ్వమన్నారు. దీని గురించి మాకు తెలియదు అని అన్నారు. దీంతో ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు తెలియజేసేందుకు ప్రయత్నించినా వారి నుంచి ఎటువంటి స్పందనా లేకపోయింది. దీనిపై ఉన్నతాధికారులైనా చర్యలు తీసుకొని లబ్దిదారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాడు. రీచ్ నుంచి తీసుకొచ్చిన బంకమట్టితో ఇళ్ళ నిర్మాణాలను చేపడితే మా పరిస్థితి ఏంటని బాధితుడు ప్రశ్నిస్తున్నాడు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

పలమనేరు, జూన్3,2020(పున్నమి విలేకరి): ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకొంటూ,నాణ్యమైన ఇసుక కోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరను మీసేవ ఆన్ లైన్ లో చెల్లించి నిబంధనలను పాటిస్తున్న లబ్ధిదారుల నోట్లో మట్టి కొట్టి చేతులు దులుపుకుంటున్నారు కొందరు అధికారులు..పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం గండ్రాజుపల్లెకు చెందిన బత్తి గౌడ్ కుమారుడు భానుచందర్ మే నెల 30వ తేదీన ఆన్ లైన్ ద్వారా ఇసుకకు డబ్బులు చెల్లించాడు. ఈ రోజు శంకర్ రాయల్ పేట రీచ్ నుండి ట్రాక్టర్ ద్వారా పంపిణీ చేశారు. ఇసుక కి బదులుగా బంకమట్టి, మట్టిని తోలారు. డ్రైవర్ ని ప్రశ్నించగా ఇసుక రీచ్ నుండి ఇదే ఇవ్వమన్నారు. దీని గురించి మాకు తెలియదు అని అన్నారు. దీంతో ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులకు తెలియజేసేందుకు ప్రయత్నించినా వారి నుంచి ఎటువంటి స్పందనా లేకపోయింది. దీనిపై ఉన్నతాధికారులైనా చర్యలు తీసుకొని లబ్దిదారులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నాడు. రీచ్ నుంచి తీసుకొచ్చిన బంకమట్టితో ఇళ్ళ నిర్మాణాలను చేపడితే మా పరిస్థితి ఏంటని బాధితుడు ప్రశ్నిస్తున్నాడు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.