లక్ష్మణరేఖ షార్ట్ ఫిల్మ్ బిగ్ మెసేజే ఇచ్చింది..

0
1052

ప్రముఖ సినీ మాటల రచయిత మరియు నెల్లూరీయుడు శ్రీ పి.రాజేంద్రకుమార్ సమర్పణలో,శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారి నేతృత్వంలో ,శ్రీ నందమూరి తారకరామారావు ఎడిటింగ్ తో ఈ కరోనా లాక్ డౌన్ లో మనం ఇళ్ళలోనే ఉండి లక్ష్మణ రేఖ దాటకుండా ఉండాలన్న భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్రమోదీ పిలుపు మేరకు ఉత్తేజితుడైన ఓ బాబు తన హోంవర్కు చేసుకుంటూ టీవీ లో మోదీ ఉపన్యాసం విని చాక్పీసు తీసుకొని తన అపార్ట్మెంట్ ప్రధాన గేటువద్ద గీతగీచి…ఇది మన మోడీతాతయ్య చెప్పిన లక్ష్మణరేఖ… మనం మన ఇళ్ళలోనే ఉందాం. మనమంతా క్షేమంగా ఉందాం…జైహింద్…అంటూ అనంతరం లక్ష్మణరేఖ టైటిల్ భారతదేశం…జాతీయ పతాకం…లక్ష్మణరేఖ భగ్గుమంటూంటే కరోనా ని అడ్డుకొంటున్నతీరు…రాజేంద్రకుమార్ అత్యధ్భుతంగా చిన్న నిడివిలోనే పెద్ద సందేశాన్ని ఇచ్చారు. చి.ప్రఖ్యాత్ శౌర్య ఐదేళ్ళ వయస్సులో చక్కగా అభినయం చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎక్సెలెన్సు మణికొండలో చదువుతున్న ప్రఖ్యాత్ శౌర్య (ప్రత్యూష రవిచంద్ర ఏకైక కుమారుడు)(మన నెల్లూరీయుడు న్యాయవాది జీవి నాగరాజరావు సుధారాణి ల మనవడు) ఇంతటి చక్కని సందేశాన్ని ఇచ్చే షార్ట్ ఫిల్మ్ టైటిల్ డిజైను శ్రీ నితీష్ కళ్యాణ్ చేశాడు. మంచి సందేశం మిళితమైయుంది. ఈ షార్ట్ ఫిల్మ్ నిర్వహించిన పీ.రాజేంద్రకుమార్ అభినందనీయుడు. ఈ షార్ట్ ఫిల్మ్ మంచి ఖ్యాతిపొందాలనీ..తదనుగుణంగా అవార్డు పొందాలని పున్నమి కోరుకుంటుంది.