*రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్తు మండల శాఖ ఎన్నికలు*
*పున్నమి ప్రతినిధి వికారాబాద్ జిల్లా తేదీ 27/ 11/ 2025*
పరిగి నియోజకవర్గంలోని వివిధ మండలాల పండిత పరిషత్తు మండల కమిటీల ఎన్నికలు ఘనంగా నిర్వహించబడినాయి. వికారాబాద్ జిల్లా శాఖ అధ్యక్షులు డాక్టర్ మానుపురి వెంకటేశ్వర్లు గారి నేతృత్వంలో, ప్రధాన కార్యదర్శి ఎజాజ్ అహ్మద్ గారి సమన్వయంతో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా తాజాగా ఎన్నికైన మండల కమిటీ సభ్యులకు నియామక పత్రాలను జిల్లా ప్రధాన కార్యదర్శి అందజేశారు.
అధ్యక్షులు డాక్టర్ మానుపురి వెంకటేశ్వర్లు మరియు ప్రధాన కార్యదర్శి ఎజాజ్ అహ్మద్ మాట్లాడుతూ—
భాషా పండితులకు టెట్ పరీక్ష నుండి మినహాయింపు కల్పించేందుకు రాష్ట్ర శాఖ కృషి చేస్తున్నదని, అందరూ ఇందుకోసం సంఘటితంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.
1/2005 ఆక్ట్ రద్దుకు న్యాయపరంగా పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చినదని తెలిపారు.
ఉన్నత పాఠశాలలో భాషా ఉపాధ్యాయుల నియామకం, ప్రాథమిక పాఠశాలలో భాషా పండితుల నియామకం వంటి అంశాల్లో పండిత పరిషత్తు మాత్రమే నిరంతర పోరాటం చేస్తుందని పేర్కొన్నారు.
జీవో 190 సవరణ ద్వారా భాషా ఉపాధ్యాయులకు అవకాశం కల్పించాలని కోరుకున్నారు.
భాషా పండితులుగా పనిచేసిన కాలానికి నోషనల్ బెనిఫిట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తాజాగా ఎన్నుకోబడిన మండల కమిటీలు
పరిగి మండలం:
అధ్యక్షులు: ఎస్. రాములు
ప్రధాన కార్యదర్శి: వీరానందం చారి
కోశాధికారి: అనిత
మహిళా ప్రతినిధులు: అనంతలక్ష్మి, బీబీ
పూడూరు మండలం:
అధ్యక్షులు: ఉమర్ ఖాన్
ప్రధాన కార్యదర్శి: టీ. మౌనిక
కోశాధికారి: షఫి
కుల్కచర్ల మండలం:
అధ్యక్షులు: పల్లె సీనయ్య
ప్రధాన కార్యదర్శి: చిగుర్లపల్లి ప్రసాద్
కోశాధికారి: జి. యాదగిరి
మహిళా అధ్యక్షురాలు: గంగా
దోమ మండలం:
అధ్యక్షులు: ఆర్. బుచ్చిబాబు
ప్రధాన కార్యదర్శి: ఎం. నరసింహ
మహిళా అధ్యక్షురాలు: శాంతి
మ
కోశాధికారి: వెంకట చారి
చౌడాపూర్ మండలం:
అధ్యక్షులు: నగేషన్
ప్రధాన కార్యదర్శి: భాస్కర్
మహిళా అధ్యక్షురాలు: బి. రమాదేవి
కోశాధికారి: బసయ్య
ఈ ఎన్నికల కార్యక్రమాన్ని ఎన్నికల పరిశీలకులుగా జిల్లా సహాధ్యక్షులు రవికుమార్, జిల్లా సహా ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఫారూఖ్ పటేల్, జిల్లా కోశాధికారి మహేందర్, జిల్లా ఉపాధ్యక్షులు పి. వెంకటయ్య, జిల్లా కార్యదర్శి నయీమోద్దిన్ సమర్థవంతంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాషా ఉపాధ్యాయులు జి.మంజుల, పి.బాలమణి, కే.అమృత, జాకీర్ అలీ, ఎం.లక్ష్మణ్, ఆర్.బాలకృష్ణ, కే.జయంతి, ఐ.అమృతమ్మ, ఈ.స్వర్ణ, సి.హేమ, రుక్మిణి, టిఆర్.కవిత, ఎస్.రాములు, జె.హరి చందర్, కే.బుచ్చయ్య, బి.నరసింహ తదితరులు పాల్గొన్నారు.


