Tuesday, 24 March 2026
  • Home  
  • రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలి.. తిరుపతి ఎంపీ గురుమూర్తి
- తిరుపతి

రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను వేగవంతం చేయాలి.. తిరుపతి ఎంపీ గురుమూర్తి

శ్రీకాళహస్తి, ఏర్పేడు అక్టోబర్ 18, పున్నమి న్యూస్ : తిరుపతి నియోజకవర్గ పార్లమెంటు సబ్యుడు మద్దిల గురుమూర్తి శనివారం నాడు ఎంపీ ఏర్పేడు-వెంకటగిరి జాతీయ రహదారి 565 పై ఏర్పేడు వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎంపి మాట్లాడుతూ… ఏర్పేడు రైల్వే క్రాసింగ్ కారణంగా ఆ రహదారిపై తరచూ ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు అంతరాయం కలుగుంతన్నారు. రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు ఆయన తెలిపారు. 2023 లో రూ.98.76 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం మొదలైనా పనులు ఇంకా నత్తనడకన సాగుతుండటం పట్ల ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ వెంకటగిరి రాపూరు ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నందున రైల్వే క్రాసింగ్ వల్ల తీవ్ర అసౌకర్యంగా ఉందని పలువురు తనకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీ తెలిపారు. అనంతరం సంబంధిత జాతీయ రహదారుల ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడి బ్రిడ్జ్ నిర్మాణపనులను వేగవంతంగ పూర్తి చేసి బ్రిడ్జ్ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. బ్రిడ్జ్ పూర్తయితే ఏర్పేడు-వెంకటగిరి మార్గంలో వాహన రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా, ఇటు ప్రయాణికులకు, అటు వ్యాపారులకు సరుకు రవాణాకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని ఆయన తన అభిమతం తెలిపారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో రైల్వే, రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి తాను శక్తి వంచన లేకుండా నిరంతరం కృషి చేస్థానాని ఎంపీ పేర్కొన్నారు.

శ్రీకాళహస్తి, ఏర్పేడు అక్టోబర్ 18, పున్నమి న్యూస్ : తిరుపతి నియోజకవర్గ పార్లమెంటు సబ్యుడు మద్దిల గురుమూర్తి శనివారం నాడు ఎంపీ ఏర్పేడు-వెంకటగిరి జాతీయ రహదారి 565 పై ఏర్పేడు వద్ద నిర్మాణంలో ఉన్న రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. ఈ సందర్బంగా ఎంపి మాట్లాడుతూ… ఏర్పేడు రైల్వే క్రాసింగ్ కారణంగా ఆ రహదారిపై తరచూ ట్రాఫిక్ స్తంభించి రాకపోకలకు అంతరాయం కలుగుంతన్నారు. రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చేసినట్లు ఆయన తెలిపారు. 2023 లో రూ.98.76 కోట్లతో రోడ్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం మొదలైనా పనులు ఇంకా నత్తనడకన సాగుతుండటం పట్ల ఎంపీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ వెంకటగిరి రాపూరు ప్రాంతాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నందున రైల్వే క్రాసింగ్ వల్ల తీవ్ర అసౌకర్యంగా ఉందని పలువురు తనకు ఫిర్యాదు చేసినట్లు ఎంపీ తెలిపారు. అనంతరం సంబంధిత జాతీయ రహదారుల ఇంజనీరింగ్ విభాగం అధికారులతో మాట్లాడి బ్రిడ్జ్ నిర్మాణపనులను వేగవంతంగ పూర్తి చేసి బ్రిడ్జ్ సదుపాయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. బ్రిడ్జ్ పూర్తయితే ఏర్పేడు-వెంకటగిరి మార్గంలో వాహన రాకపోకలకు ఎటువంటి అంతరాయం లేకుండా, ఇటు ప్రయాణికులకు, అటు వ్యాపారులకు సరుకు రవాణాకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని ఆయన తన అభిమతం తెలిపారు. తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో రైల్వే, రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధికి తాను శక్తి వంచన లేకుండా నిరంతరం కృషి చేస్థానాని ఎంపీ పేర్కొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.