అమలాపురం, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి) : అమలాపురం – కాకినాడ హైవే రోడ్డు, ముమ్మిడివరం దగ్గిర కోళ్లఫార్మ్ లారీ ద్విచక్ర వాహనం మీద వస్తున్న యానాం వాసులను బుధవారం ఉదయం అత్యంత వేగంగా డీ కొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు . సుమారు 60 సంవత్సరాలు ఉన్న పెద్దాయన కాళ్ళు విరిగి రక్తం కారుతు రోడ్డుపై మూలుగుతున్నారు. సుమారు 50 సంవత్సరాలు ఉన్న మహిళకు తలకు దెబ్బ తగిలింది. అదే సమయంలో విధి నిర్వహణలో అటుగా వెళుతున్న ఐ టి డి ఏ.ఎ పి డి. టి. విశ్వనాథ్ 108 అంబులెన్సుకి ఫోన్ చేశారు. అది రావడానికి లేట్ అవుతుందని తెలుసుకుని ఆటోలో అమలాపురం, కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలోసాగర్ కేసు విచారణ చేస్తున్నారు. మానవతా దృక్పథంతో సేవలందించిన ఐ టి డి ఎ. ఏ పి డి విశ్వనాథ ను ప్రయాణికులు, పస్థానికులు అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరుగుద్దో ముందుగా ఎవరు ఊహించలేమని,. మనం మనవంతుగా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలి, వేగంగా వెళ్ళకూడదు, రూల్స్ తప్పకుండా పాటించాలని ప్రాణం కన్నా ముఖ్యం ఏదీ ముఖ్యం కాదని, కుటుంబ సభ్యులే ముఖ్యమని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి …పలువురికి గాయాలు
అమలాపురం, అక్టోబరు 22 (పున్నమి ప్రతినిధి) : అమలాపురం – కాకినాడ హైవే రోడ్డు, ముమ్మిడివరం దగ్గిర కోళ్లఫార్మ్ లారీ ద్విచక్ర వాహనం మీద వస్తున్న యానాం వాసులను బుధవారం ఉదయం అత్యంత వేగంగా డీ కొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు . సుమారు 60 సంవత్సరాలు ఉన్న పెద్దాయన కాళ్ళు విరిగి రక్తం కారుతు రోడ్డుపై మూలుగుతున్నారు. సుమారు 50 సంవత్సరాలు ఉన్న మహిళకు తలకు దెబ్బ తగిలింది. అదే సమయంలో విధి నిర్వహణలో అటుగా వెళుతున్న ఐ టి డి ఏ.ఎ పి డి. టి. విశ్వనాథ్ 108 అంబులెన్సుకి ఫోన్ చేశారు. అది రావడానికి లేట్ అవుతుందని తెలుసుకుని ఆటోలో అమలాపురం, కిమ్స్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన బాధితుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ముమ్మిడివరం ఎస్ఐ జ్వాలోసాగర్ కేసు విచారణ చేస్తున్నారు. మానవతా దృక్పథంతో సేవలందించిన ఐ టి డి ఎ. ఏ పి డి విశ్వనాథ ను ప్రయాణికులు, పస్థానికులు అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదం ఎలా జరుగుద్దో ముందుగా ఎవరు ఊహించలేమని,. మనం మనవంతుగా జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకోవాలి, వేగంగా వెళ్ళకూడదు, రూల్స్ తప్పకుండా పాటించాలని ప్రాణం కన్నా ముఖ్యం ఏదీ ముఖ్యం కాదని, కుటుంబ సభ్యులే ముఖ్యమని సూచించారు.

