వెల్దండ ,అక్టోబర్ 11 , పున్నమి న్యూస్:వెల్దండ లో ఇటీవల కురుస్తున్న వర్షాలకు రహదారులు గుంతల మయంగా మారాయి. వెల్దండ మండల కేంద్రం నుండి గుండాలకు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా ధ్వంసం అవడంతో ఆయా గ్రామాలకు వెళ్లే వాహనదారులు మోడల్ స్కూల్ విద్యార్థులు, జిల్లా పరిషత్ హై స్కూల్ కి వెళ్లే విద్యార్థులు, ఉపాధ్యాయులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. రోడ్డు వెంట విద్యార్థులు నడవలేని దయనీయమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్డుపై ఏర్పడిన గుంతలను తక్షణమే పూడ్చివేయాలని స్థానికులు కోరుతున్నారు.
Video: https://youtube.com/shorts/T5YVbYKo_L0?si=GW3h6aGr3MBHHWV5


