అల్లూరి సీతారామరాజు జిల్లా: రైవాడ వద్ద జరిగిన బోటు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదంలో మరణించిన వారి శవాలను వెలికితీసేందుకు రెస్క్యూ టీములు ప్రధానంగా నదిలో తీవ్రంగా గాలింపు చర్యలు కొనసాగిస్తుండగా, బాదిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
స్థలానికి చేరుకున్న అల్లూరి జిల్లా కలెక్టర్ పరిస్థితిని సమీక్షించినప్పటికీ, తమను పూర్తిగా ఆదుకునే వరకు శవాలకు పోస్టుమార్టం నిర్వహించేందుకు అనుమతి ఇవ్వబోమని బాదిత కుటుంబాలు స్పష్టంగా తెలిపారు. తమకు తగిన సహాయం, న్యాయం అందేవరకు శవాలను అప్పగించబోమని కుటుంబ సభ్యులు పట్టుబడుతున్నారు.
“గిరిజనులపై ఇంత చులకనా?” – గిరిజనుల ఆగ్రహావేశం
ఇప్పటికే గిరిజన వర్గాల్లో పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది.
“గిరిజనులు పట్ల ఇంత నిర్లక్ష్యం, చులకన భావం పనికిరాద” అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన 24 గంటలు పూర్తవుతున్నా, ఒక్క ప్రజా ప్రతినిధి కూడా ఘటన స్థలానికి రాలేదని బాదిత కుటుంబాలు ఆవేదన చెందుతున్నాయి. ఈ నిర్లక్ష్యం గిరిజనులను మరింతగా కలిచివేసింది.
రక్షణ చర్యలు కొనసాగుతూనే – కుటుంబాలు న్యాయం డిమాండ్
రెస్క్యూ బృందాలు నదిలో గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశాయి.
మిగిలిన శవాలను వెలికితీసే ప్రయత్నాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.
ప్రభుత్వంపై, ప్రజాప్రతినిధులపై గిరిజనుల అసహనం పెరుగుతోంది.
బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్ధిక సహాయం, న్యాయం అందించాలని గిరిజన నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
రైవాడ బోటు ప్రమాదం జిల్లాలో కలకలం రేపింది. గిరిజనుల ఆవేదన, రెస్క్యూ కార్యకలాపాలు, పరిపాలనా స్పందన – పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.


