రైల్వేకోడూరు ఆగస్టు పున్నమి ప్రతినిధి
కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ యం. భాస్కర్ రెడ్డి గారి అధ్యక్షతన, కళాశాల RRC మరియు NSS ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు ఆల్బెండజోల్ టాబ్లెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ గారు నులిపురుగుల వల్ల కలిగే హానికర ప్రభావాలు, వాటి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యార్థులకు వివరించారు.అదేవిధంగా, ఇంటర్నేషనల్ యూత్ 2025 — యూత్ ఎంపవర్మెంట్ అగెనస్ట్ HIV: ఎడ్యుకేట్, ప్రివెంట్, ఇన్స్పైర్ అనే రెండు నెలల ప్రత్యేక కార్యక్రమం లో భాగంగా, కళాశాల NSS మరియు RRC ఆధ్వర్యంలో, కోడూరు సామాజిక ఆరోగ్య కేంద్రం ICTC టీం సహకారంతో విద్యార్థులకు AIDS / HIV పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం, పట్టణంలో అవగాహన ర్యాలీ కూడా చేపట్టారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేశ్, IQAC కోఆర్డినేటర్ శ్రీ జి. దయానందం, NSS కోఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, RRC కోఆర్డినేటర్ డాక్టర్ ఈ. ప్రేమలత, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.


