రైల్వేకోడూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షులు పంతగాని నరసింహ ప్రసాద్ గారి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కె.కె. చౌదరి గారు పుట్టినరోజు కేక్ కట్ చేసి నరసింహ ప్రసాద్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నరసింహ ప్రసాద్ గారు పార్టీ పట్ల అంకితభావంతో పని చేస్తూ యువతకు మార్గదర్శకులుగా నిలుస్తున్నారని అభినందించారు.
కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.


