పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లి కట్ట ఆవరణలో శ్రీ వరాహి కేఫ్ అండ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. కటికం నవీన్ కుమార్ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రిబ్బన్ కటింగ్ చేసి రెస్టారెంట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అరవ శ్రీధర్ మాట్లాడుతూ, “గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధునిక వసతులతో కూడిన ఆహార కేంద్రాలు ఏర్పడటం ఆనందకరం. స్థానిక ప్రజలకు నాణ్యమైన ఆహారం లభించడంతో పాటు, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఇలాంటి ప్రయత్నాలు ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటాయి” అని అన్నారు. ఆయన స్థానిక వ్యాపారవేత్తలు ముందుకు రావాలని, గ్రామీణ ప్రాంత అభివృద్ధికి కొత్త ఆవిష్కరణలు, సేవా కార్యక్రమాలు అవసరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


