అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా మెడికల్ & ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో యువత కోసం ఈరోజు ఉదయం 6 గంటలకు నిర్వహించిన జిల్లా స్థాయి 5కె రెడ్ రన్ మారథాన్లో రైల్వేకోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.బి.కాం (సి.ఏ) విద్యార్థి శ్రీ వై. నాని ప్రథమ బహుమతిని సాధించి ₹10,000 నగదు పురస్కారం అందుకున్నారు. అలాగే బి.ఏ తృతీయ సంవత్సరం విద్యార్థి పి. జగదీశ్ నాలుగో బహుమతిని సాధించారు.విద్యార్థుల విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై. భాస్కర్ రెడ్డి అభినందనలు తెలుపుతూ, “జిల్లా స్థాయిలో విజయం సాధించడం కళాశాల గర్వకారణం. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు పూర్తి సహకారం అందిస్తాము” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, ఆర్.ఆర్.సి కోఆర్డినేటర్ డాక్టర్ ఈ. ప్రేమలత, యన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, ఫిజికల్ డైరెక్టర్ కుమారి ఏ. శ్రావణి పాల్గొన్నారు.

రైల్వేకోడూరు డిగ్రీ కళాశాల విద్యార్థులకు జిల్లా స్థాయి 5కె మారథాన్లో విజయాలు
అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా మెడికల్ & ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో యువత కోసం ఈరోజు ఉదయం 6 గంటలకు నిర్వహించిన జిల్లా స్థాయి 5కె రెడ్ రన్ మారథాన్లో రైల్వేకోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.బి.కాం (సి.ఏ) విద్యార్థి శ్రీ వై. నాని ప్రథమ బహుమతిని సాధించి ₹10,000 నగదు పురస్కారం అందుకున్నారు. అలాగే బి.ఏ తృతీయ సంవత్సరం విద్యార్థి పి. జగదీశ్ నాలుగో బహుమతిని సాధించారు.విద్యార్థుల విజయంపై కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వై. భాస్కర్ రెడ్డి అభినందనలు తెలుపుతూ, “జిల్లా స్థాయిలో విజయం సాధించడం కళాశాల గర్వకారణం. రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొనేందుకు పూర్తి సహకారం అందిస్తాము” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి. రమేష్, ఆర్.ఆర్.సి కోఆర్డినేటర్ డాక్టర్ ఈ. ప్రేమలత, యన్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, ఫిజికల్ డైరెక్టర్ కుమారి ఏ. శ్రావణి పాల్గొన్నారు.

