చిట్వేల్ ఆగస్టు { పున్నమి ప్రతినిధి}
రైల్వేకోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో కళాశాల ఇంచార్జీ ప్రిన్సిపాల్ డాక్టర్ జి.రమేష్ గారి అధ్యక్షతన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్రా లో భాగంగా అంటువ్యాధులు నివారణ మరియు పరిశుభ్రత అనే అంశం పై మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వాటి వలన వచ్చే నష్టాలను మరియు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు కళాశాల రసాయన శాస్త్ర ఉపన్యాసకుడు శ్రీ.కృష్ణమూర్తి గారు మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు వలన కలిగే ఇబ్బందులు మన పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా మనం చూడాలని తెలిపారు.కళాశాల యన్.ఎస్. యస్.ప్రోగ్రామ్ అధికారి శ్రీ దాసరి మోషే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమము మన పరిసరాల పరిశుభ్రత్త కు ప్రాధన్యత ఇవ్వాలని తెలిపారు. విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయడం జరిగింది తర్వాత విద్యార్దులు కళాశాల లో చుట్టుప్రక్కల శుభ్రం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది విద్యార్దులు పాల్గొన్నారు


