కోడూరు అభివృద్ధికి పరిశ్రమలు అత్యవసరం:
పంతగాని నరసింహ ప్రసాద్
రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి
అన్నమయ్య జిల్లా కోడూరు నియోజకవర్గంలో పరిశ్రమల స్థాపన అత్యవసరమని టీడీపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు పంతగాని నరసింహ ప్రసాద్ స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో అనేక మంది గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారని, పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వేలాది కుటుంబాలకు జీవనోపాధి లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ కృషి చేశారని తెలిపారు.


