రైల్వే కోడూరు ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
వినాయక చవితి తొలి సందర్భంగా బుధవారం మధ్యాహ్నం పట్టణంలోని వైఎస్ఆర్సిపి కార్యాలయంలో వినాయక స్వామి విగ్రహాన్ని ప్రతిష్టించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు పొందుతూ, నియోజకవర్గ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోరముట్ల శ్రీనివాసులు గారు ప్రసంగించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు సిహెచ్. రమేష్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ సుబ్బరామరాజు, సర్పంచ్ హరికృష్ణ రెడ్డి, ఎంపీటీసీ మహేష్ రెడ్డి, ఆంజనేయులు, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గునిశెట్టి రమేష్, వార్డ్ మెంబర్లు ఫరూక్, కరీముల్లా, మొహమాద్, వినోద్ కన్నా, సిద్దయ్య, కొన్నిపాటి ప్రసాద్, సుబ్బారాయుడు, కోప్పల శంకరయ్య, ఎక్స్ ఎంపీటీసీ ఆనందయ్య తదితరులు పాల్గొన్నారు.


