సాగు నీటి సంఘాలను బలోపేతం చేసి రైతుల సమస్యలకు పరిష్కారం చూపే విధంగా సీఎం చంద్రబాబునాయుడు అమరావతి లో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమానికి బంటుమిల్లి నుండి బస్సు లో తరలి వెళ్లిన బంటుమిల్లి మండల నీటి సంఘాల అధ్యక్షులు.ఈ కార్యక్రమాన్ని స్థానిక MLA కాగితకృష్ణప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల సమస్యలు, కాలువల పటిష్టత, నీటి సంఘాల బలోపేతమే ఈ మీటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ సదస్సుకు తరలి వెళ్లిన వారిలో బంటుమిల్లి DC చైర్మన్ బొర్రా కాశీ, ములపర్రు నీటి సంఘం అధ్యక్షులు చింతా వెంకటేశ్వరావు, కంఠమనేని మురళి, మరియు కూటమి నాయకులు తదితరులు ఉన్నారు.




