శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 19: శ్రీకాళహస్తి నియోజికవర్గంలోని తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, తెలుగుదేశం పార్టీ తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి వ్యవసాయం, అనుబంధరంగాల కోసం 2026-27 బడ్జెట్లో రూ.13,598 కోట్లను కేటాయిస్తూ ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ విడుదలపై రైతులకు కలిగే ఉపయోగలపై తెదేపా నాయకులు తంగేళ్ళ పాలెంలో అవగాహన సమావేశాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత వైసిపి ప్రభుత్వంలో ఎదురైన చేదు అనుభవాలు మళ్ళీ పునరావృతం కాకూడదని, రైతన్నకు అండగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నదని రైతును రాజుగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతన్నా మీకోసం” కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇందులో పంచ సూత్రాలు అయిన “(1) నీటి భద్రత, (2)డిమాండ్ ఆధారిత పంటలు, (3) అగ్రిటెక్, (4) ఫుడ్ ప్రాసెసింగ్, (5) ప్రభుత్వం నుంచి మద్దతు” అనే అంశాలకి అధిక ప్రాధాన్యత కల్పించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని గుర్తు చేశారు. ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల చొప్పున “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన” పథకం క్రింద, 2025-26లో రెండవ విడత వరకు 46.86 లక్షల మంది రైతు కుటుంబాలకు 6,309.44 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని, అలాగే 2026-27కు గాను 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించారని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం బకాయి పెట్టిన ధాన్యం సేకరణకు సంబంధించిన పాత బకాయిలు 1,674.47 కోట్ల రూపాయలను చెల్లించి రైతులను ఆదుకున్న ఘనత ఎన్డీయే కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారిదే అని కొనియాడారు. గత ప్రభుత్వం పాలనాకాలంలో రైతులు ఎదుర్కొన్న చేదు అనుభవాలను తొలగించి, 2025-26 సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా చేసుకొని, దానిని పూర్తి పని చేసి రైతులకు అండగా నిలిచామని గత 20 నెలల్లో రాష్ట్రంలో ఏ పంట ధర తగ్గినా..ఏ ఒక్క రైతూ నష్టపోకూడదన్న లక్ష్యంతో ధరల స్థిరీకరణకు గత బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు పెట్టినప్పటికీ, దాదాపు రెట్టింపుగా 588 కోట్ల రూపాయలు ఖర్చుచేసి సుమారు లక్ష మంది రైతులను ప్రభుత్వం ఆదుకున్నదని తోతాపూరి మామిడి రైతులకు 190 కోట్ల రూపాయలు, కడప కర్నూలు ఉల్లి రైతుల నుంచి ఉల్లి కొనుగోలుకు 17.56 కోట్ల రూపాయలు, ఉల్లి పంట నష్ట పరిహారం కింద హెక్టారుకు రూ.25 వేలు ఉన్న పరిహారాన్ని 50 వేల రూపాయలకు పెంచి ఉల్లి రైతులకు 128.33 కోట్ల రూపాయలు చెల్లించారని, అలాగే, పొగాకు రైతులకు 240 కోట్ల రూపాయలు, కోకో రైతులకు 12 కోట్ల రూపాయలు చెల్లించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు నాగరాజు, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, తెలుగు యువత తొట్టంబేడు మండల అధ్యక్షుడు బీమాల చంద్రబాబు @ చందు, సీనియర్ బిసి నాయకులు బీమాల వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

రైతు సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోంది-తెదేపా నాయకులు
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 19: శ్రీకాళహస్తి నియోజికవర్గంలోని తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, తెలుగుదేశం పార్టీ తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి వ్యవసాయం, అనుబంధరంగాల కోసం 2026-27 బడ్జెట్లో రూ.13,598 కోట్లను కేటాయిస్తూ ఆర్థిక శాఖ మంత్రి కేశవ్ శాసనసభలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. బడ్జెట్ విడుదలపై రైతులకు కలిగే ఉపయోగలపై తెదేపా నాయకులు తంగేళ్ళ పాలెంలో అవగాహన సమావేశాన్ని చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గత వైసిపి ప్రభుత్వంలో ఎదురైన చేదు అనుభవాలు మళ్ళీ పునరావృతం కాకూడదని, రైతన్నకు అండగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు చేపడుతున్నదని రైతును రాజుగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు రైతన్నా మీకోసం” కార్యక్రమాన్ని ప్రారంభించారని, ఇందులో పంచ సూత్రాలు అయిన “(1) నీటి భద్రత, (2)డిమాండ్ ఆధారిత పంటలు, (3) అగ్రిటెక్, (4) ఫుడ్ ప్రాసెసింగ్, (5) ప్రభుత్వం నుంచి మద్దతు” అనే అంశాలకి అధిక ప్రాధాన్యత కల్పించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని గుర్తు చేశారు. ప్రతి రైతు కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేల చొప్పున “అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన” పథకం క్రింద, 2025-26లో రెండవ విడత వరకు 46.86 లక్షల మంది రైతు కుటుంబాలకు 6,309.44 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిందని, అలాగే 2026-27కు గాను 6,600 కోట్ల రూపాయలు బడ్జెట్లో ప్రతిపాదించారని తెలిపారు. గత వైసిపి ప్రభుత్వం బకాయి పెట్టిన ధాన్యం సేకరణకు సంబంధించిన పాత బకాయిలు 1,674.47 కోట్ల రూపాయలను చెల్లించి రైతులను ఆదుకున్న ఘనత ఎన్డీయే కూటమి ప్రభుత్వ అధినేత చంద్రబాబు నాయుడు గారిదే అని కొనియాడారు. గత ప్రభుత్వం పాలనాకాలంలో రైతులు ఎదుర్కొన్న చేదు అనుభవాలను తొలగించి, 2025-26 సీజన్లో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా చేసుకొని, దానిని పూర్తి పని చేసి రైతులకు అండగా నిలిచామని గత 20 నెలల్లో రాష్ట్రంలో ఏ పంట ధర తగ్గినా..ఏ ఒక్క రైతూ నష్టపోకూడదన్న లక్ష్యంతో ధరల స్థిరీకరణకు గత బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు పెట్టినప్పటికీ, దాదాపు రెట్టింపుగా 588 కోట్ల రూపాయలు ఖర్చుచేసి సుమారు లక్ష మంది రైతులను ప్రభుత్వం ఆదుకున్నదని తోతాపూరి మామిడి రైతులకు 190 కోట్ల రూపాయలు, కడప కర్నూలు ఉల్లి రైతుల నుంచి ఉల్లి కొనుగోలుకు 17.56 కోట్ల రూపాయలు, ఉల్లి పంట నష్ట పరిహారం కింద హెక్టారుకు రూ.25 వేలు ఉన్న పరిహారాన్ని 50 వేల రూపాయలకు పెంచి ఉల్లి రైతులకు 128.33 కోట్ల రూపాయలు చెల్లించారని, అలాగే, పొగాకు రైతులకు 240 కోట్ల రూపాయలు, కోకో రైతులకు 12 కోట్ల రూపాయలు చెల్లించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు, తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్, శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు నాగరాజు, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, తెలుగు యువత తొట్టంబేడు మండల అధ్యక్షుడు బీమాల చంద్రబాబు @ చందు, సీనియర్ బిసి నాయకులు బీమాల వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

