శ్రీకాకుళం జిల్లా, నరసన్నపేట:స్థానిక గవర్నమెంట్ హైస్కూల్లో నిర్వహించిన జిల్లాస్థాయి యోగాసన స్పోర్ట్స్ పోటీల్లో బొమ్మాలి కాగేశ్వరరావు అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి గొప్ప విజయాన్ని సాధించారు. 45-55 సంవత్సరాల వయోపరిమితిలో బ్యాంక్ బెండ్ మరియు హ్యాండ్ బ్యాలెన్స్ విభాగాల్లో ఆయన రెండు గోల్డ్ మెడల్స్ గెలుచుకున్నారు.బొమ్మాలి కాగేశ్వరరావు సాధారణ కుటుంబంలో పుట్టి, భారత ఆర్మీలో సేవలందిస్తూ అనేక దేశాల్లో పర్యటించారు. ప్రస్తుతం నరసన్నపేటలో కులమతాలకు అతీతంగా, పేద–ధనిక భేదం లేకుండా, విద్యార్థులకు మరియు యువతకు ఉచితంగా ఫిట్నెస్ శిక్షణ అందిస్తున్నారు.ప్రత్యేకంగా పంజాబ్కు చెందిన ఘట్కా అనే సంప్రదాయ ఆటకు ఆయన డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. 18 సంవత్సరాల పైబడిన విద్యార్థులకు ఎలాంటి పారితోషికం లేకుండా ఉచితంగా శిక్షణ ఇచ్చి వారి జీవితాలను వెలుగులోకి తీసుకువచ్చే మహనీయునిగా ఆయన నిలుస్తున్నారు.ఈ సేవా కార్యక్రమంలో రిటైర్డ్ ఆర్మీ వ్యక్తి సురపు సురేష్ కూడా కాగేశ్వరరావుకు తోడుగా సేవలందిస్తున్నారు. ఈ ఇద్దరి సేవలు శ్రీకాకుళం జిల్లాకే గర్వకారణంగా నిలుస్తున్నాయి.ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలను సన్మానించేందుకు నరసన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి, తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా సమన్వయకర్త బగ్గు అర్చన, పలువురు సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు హాజరయ్యారు.


