రూ.500 నకిలీ నోట్లు కలకలం – అప్రమత్తంగా ఉండండి!.
హైదరాబాద్ బాచుపల్లిలో రూ.15 లక్షల విలువైన నకిలీ రూ.500 నోట్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు, పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తి ప్రేమ్ చందును అరెస్టు చేశారు. మహారాష్ట్ర పూణేకి చెందిన రాకేష్ సూచనలతో నకిలీ కరెన్సీని పంపిణీకి తీసుకురావడమే లక్ష్యంగా అతడు నగరానికి వచ్చినట్లు విచారణలో వెల్లడైంది. నకిలీ కరెన్సీపై పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ప్రజలు నోట్ల భద్రతా లక్షణాలను పరిశీలించి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

