సంక్రాంతి పండుగను ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు కొత్త ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. ఇటీవల వాట్సాప్ గ్రూపుల్లో “PhonePe పొంగల్ గ్రాండ్ గిఫ్ట్ ప్రోగ్రామ్ – అన్ని యూజర్లకు రూ.5,000” అంటూ ఓ లింక్ వేగంగా వైరల్ అవుతోంది. ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ లింక్ను ఓపెన్ చేస్తే ‘404 ఎరర్’ చూపిస్తుండటం గమనార్హం.
ఇలాంటి లింక్లపై నమ్మకం పెట్టుకోవద్దని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. డబ్బుల ఆశతో లింక్లను క్లిక్ చేస్తే ఫోన్ హ్యాక్ కావడం, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండా వచ్చే గిఫ్ట్ మెసేజ్లను పూర్తిగా నిర్లక్ష్యం చేయాలని సూచిస్తున్నారు.
మీకు కూడా ఇలాంటి మెసేజ్ వచ్చిందా? అయితే వెంటనే జాగ్రత్త పడండి.


