ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి/జనవరి
మద్దికుంట గ్రామంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్లో రన్నర్గా నిలిచిన కట్టమైసమ్మ టీం, తమకు లభించిన బహుమతిని సేవా కార్యక్రమంగా మార్చి ప్రశంసలు అందుకుంది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కట్టమైసమ్మ టీం సభ్యులు గ్రామంలోని పాఠశాల విద్యార్థు స్టీల్ ప్లేట్లను పంపిణీ చేశారు.
, పేద విద్యార్థుల అవసరాలను గుర్తించి సేవా దృక్పథంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కట్టమైసమ్మ టీం చర్యను గ్రామస్తులు అభినందించారు.
ఈ కార్యక్రమం ద్వారా చిన్నారుల్లో పరిశుభ్రతతో పాటు సేవాభావం, సామాజిక బాధ్యత పెంపొందుతాయని పలువురు తెలిపారు.
ఆటల పోటీలలో గెలుపు ఓటమి సహజమని అవసరమైన వారికి ఉపయోగపడే సేవేయే నిజమైన గెలుపు అని ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గారు టీం సభ్యులను అభినందించారు


