తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా రావిరాల మండలం నుండి ప్రారంభమైన రావిరాల శబరిమల మహా పాదయాత్ర ఘనంగా సాగుతోంది.దాదాపు 80 మంది అయ్యప్ప మాలధారణ స్వాములు ఈ మహా పాదయాత్రలో పాల్గొన్నారు.శబరిమలై వరకు పాదయాత్రగా బయలుదేరిన ఈ బృందం అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పుతనవారిపల్లి శివాలయం వద్దకు చేరుకున్న సందర్భంగా విశేషంగా స్వాగతం లభించింది.ఈ సందర్భంగా నందలూరు మండలానికి చెందిన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు రాచూరి మురళి, గొర్ల శ్రీనివాసులు (బాబు),విస్డమ్ స్కూల్ అధినేత వలిమి సుధాకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,తుమ్మది శివ కుమార్,రావిరాల శబరిమల మహా పాదయాత్ర గురు స్వామి జి. వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి,వారి బృందానికి మిఠాయి బాక్సులు అందజేశారు.స్థానిక భక్తులు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాముల పాదయాత్ర విజయవంతంగా పూర్తవ్వాలని అయ్యప్ప నామస్మరణతో ప్రార్థించారు.

రావిరాల శబరిమల మహా పాదయాత్రకు ఘన స్వాగతం పుల్లంపేట మండలంలోని పుతనవారిపల్లి శివాలయంలో స్వాముల సత్కారం
తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా రావిరాల మండలం నుండి ప్రారంభమైన రావిరాల శబరిమల మహా పాదయాత్ర ఘనంగా సాగుతోంది.దాదాపు 80 మంది అయ్యప్ప మాలధారణ స్వాములు ఈ మహా పాదయాత్రలో పాల్గొన్నారు.శబరిమలై వరకు పాదయాత్రగా బయలుదేరిన ఈ బృందం అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం పుతనవారిపల్లి శివాలయం వద్దకు చేరుకున్న సందర్భంగా విశేషంగా స్వాగతం లభించింది.ఈ సందర్భంగా నందలూరు మండలానికి చెందిన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షులు మరియు బీజేపీ నాయకులు రాచూరి మురళి, గొర్ల శ్రీనివాసులు (బాబు),విస్డమ్ స్కూల్ అధినేత వలిమి సుధాకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,తుమ్మది శివ కుమార్,రావిరాల శబరిమల మహా పాదయాత్ర గురు స్వామి జి. వెంకటేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి,వారి బృందానికి మిఠాయి బాక్సులు అందజేశారు.స్థానిక భక్తులు,గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వాముల పాదయాత్ర విజయవంతంగా పూర్తవ్వాలని అయ్యప్ప నామస్మరణతో ప్రార్థించారు.

