శ్రీ రాములోరి గుడి పూజలో పాల్గొన్న….
ముక్కా వరలక్ష్మి.
ఘనంగా ఆహ్వానం పలికిన నాగ శివశంకర్ రెడ్డి, గ్రామ పెద్దలు ప్రజలు
అన్నమయ్య జిల్లా నవంబర్ 08 ( మనం న్యూస్ ప్రతినిధి): రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం చిన్న ఓరంపాడు దిగువపల్లి లో నూతనంగా నిర్మించిన శ్రీరాము లోరీ గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి శనివారం ముక్కా వరలక్ష్మి తో పాటు కూటమి నాయకులు రాముల వారి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముక్క వరలక్ష్మికి ప్రత్యేక ఆహ్వానం పలికి వేద పండితులు చేత పూజలు చేయించిన సీనియర్ నాయకులు నాగ శివశంకర్ రెడ్డి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ముక్క వరలక్ష్మి మాట్లాడుతూ, ఎంతో ఘన చరిత్ర కలిగిన దిగువపల్లి గ్రామానికి తగినట్లు శ్రీరామ సీతా లక్ష్మణ ఆంజనేయస్వామి విగ్రహాలను గుడిలో ప్రతిష్టించి కనుల పండుగగా శ్రీరామనవమి పండుగను తలపించే విధంగా విధంగా గుడి ప్రాంగణం వేదమంత్రాలతో తప్పెట్లు మేళాలతో. విద్యుత్ దీపాల అలంకరణతో పూలమాలలతో ఎంతో ఆకర్షణీయంగా ఎంతో ఘనంగా గుడి ప్రారంభించి ధజస్తంభం నిర్మించి గుడిని ప్రారంభించడం ఎంతో అభినందనీయమని గ్రామస్తులకు ప్రత్యేక అభినందనలు ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ పెద్దలు గ్రామస్తులు మాజీ సర్పంచ్ సరస్వతి నాయకులు ముక్కా రమేష్ రెడ్డి, సుబ్బరాయుడు నాయుడు నరేందర్ రెడ్డి ముక్క మోహన్ రెడ్డి, శ్రీనివాసులు నాయుడు, నరసింహారెడ్డి గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు


