కామారెడ్డి ప్రతినిధి 19 సెప్టెంబర్ పున్నమి న్యూస్
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో పోషణ మాస వార చాలు నిర్వహించినట్లు అంగన్వాడి కార్యకర్తలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోషణ మాసాన్ని ఈ నెల 17 నుంచి వచ్చే నెల 16 వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.. ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను విజయవం తం చేయాలని అధికారులు సూచించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబరు నెలలో ‘పోషణ మాస వారోత్సవాలు’ నిర్వహిస్తుంది. పోషకాహార లోపం లేని సమాజం కోసం ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని చెప్పారు. అంగన్వాడీ కేంద్రాలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది గర్భిణులు, బాలింత లు, కిశోర బాలికలు, పిల్లలకు పోషకాహారం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించామన్నారు.. ఇందులో భాగంగా, ఆరోగ్యానికి అవసరమైన ఆహారపు అలవాట్లు, పోషక విలువల గురించి వివరించామని చెప్పారు. గర్భిణులకు సీమంతా లు చేశామని అన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా సమాజంలో పోషకాహార లోపాన్ని తగ్గించి, ఆరోగ్య వంతంగా తయారు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ జ్యోతి, అంగన్వాడి కార్యకర్తలు ఇంద్ర శోభ, సుజాత, విద్యార్థులు, గర్భిణి స్త్రీలు తదితరులు పాల్గొన్నారు


