కామారెడ్డి, 03జనవరి, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (అదనపు ఎస్పీ) ఐ.నర్సింహారెడ్డి శనివా రం రామారెడ్డి మండల పరిధిలోని పాత నేరస్తుల ను పరిశీలించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పోలీసు సిబ్బంది గైడేన్స్ తో హిస్టరీ షీట్లు, పెండింగ్ కేసులు, ప్రస్తుత కార్యకలాపాలు మొదలైనవి తప్ప కుండ తనిఖీ చేశారు. ఈ తనిఖీల ముఖ్య లక్ష్యం మండలంలో నేరాలను నివారించడం, పాత నేర స్తులను పర్యవేక్షణలో ఉంచడమేనని అధికారులు తెలిపారు.పాత నేరస్తులు ఏరకమైన కార్యకలాపా ల్లో భాగమవుతున్నారు, వారి కుటుంబాల పరిస్థితి ఏమిటి అనేవి వివరంగా తెలుసుకున్న అదనపు ఎస్పీ, స్థానిక పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.రామారెడ్డి మండలం గ్రామీణ ప్రాంతం గా ఉండటంతో పాత నేరస్తుల పర్యవేక్షణ మరింత కఠినంగా ఉండాలని ఆయన సూచనలు చేశారు. ఇలాంటి తనిఖీలు గ్రామ ప్రజల్లో భయం తగ్గించి, భద్రతా భావనను పెంచుతాయని స్థానికులకు తెలిపారు.గ్రామ ప్రజల్లో ఆనందం.. భద్రతా చర్య లు మరింత పెరిగే అవకాశం ఈ తనిఖీలతో మం డలంలో ఇప్పటికే ఉన్న పోలీసు పెట్రాలింగ్, పర్య వేక్షణ మరింత బలపడుతుందని అధికారులు అంచనాలు,మండలంలో అన్నారం, కన్నాపూర్, పోసానిపేట వంటి గ్రామాల్లో ప్రజలు ఈ చర్యలకు స్వాగతం పలికారు. జిల్లా పోలీసు వ్యవస్థ గ్రామీణ భద్రతకు ప్రాధాన్యత ఇస్తోందని పోలీసులు చెపుతున్నారు.


