ఏపి: మొంథా తుఫాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు లేదా అమలాపురం వద్ద తీరం దాటుతుందని స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ వెల్లడించారు. ఈ రాత్రి 10 లేదా 11 గంటలకు తుఫాను తీరం దాటుతుందని.. ఆ సమయంలో గంటకు 110 KM వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. కాకినాడ, కోనసీమ జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని హెచ్చరించారు.

రాజోలు~అమలాపురం వద్ద తుఫాను తీరం దాటుతుంది: అజయ్ జైన్
ఏపి: మొంథా తుఫాను అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు లేదా అమలాపురం వద్ద తీరం దాటుతుందని స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ వెల్లడించారు. ఈ రాత్రి 10 లేదా 11 గంటలకు తుఫాను తీరం దాటుతుందని.. ఆ సమయంలో గంటకు 110 KM వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. కాకినాడ, కోనసీమ జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని చెప్పారు. అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలని హెచ్చరించారు.

