శ్రీకాళహస్తిలోని అన్నీ రాజకీయ పక్షాలకు, అధికారులకు, పాత్రికేయులకు కల్పతరువుగా మారిన రాజీవ్ నగర్ లో 2007 నుంచి జరిగిన అక్రమాలకు కారకులైన సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు లేకపోవడంతో కేవలం ప్లాట్లు కొన్నవారు, విక్రయాలకు పాల్పడిన వారు, ఇళ్ళు కట్టుకున్న పేదలకు కూటమి ప్రభుత్వంలో నిద్రపట్టడం లేదనే విమర్శలు వున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు రెండు మూడు పర్యాయాలు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జోక్యం చేసుకుని నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయడానికి మున్సిపల్, రెవిన్యూ అధికారులు,సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి రికార్డులు పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే తిరిగి మళ్ళీ స్పెషల్ డ్రైవ్ పేరుతో రాజీవ్ నగర్ కు వెళుతున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని, అక్రమాలు చేసిన వారికి, వారికి సహకరించిన అధికారులు, సిబ్బందిపై ఎక్కడున్నా జిల్లా కలెక్టర్ ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలని రాజీవ్ నగర్ వాసులు, బాధిత కుటుంబాలు కోరుతున్నారు. అలా కాకుండా కేవలం విచారణ చేసి అర్హులుకు ఇంటి పట్టాలు ఇప్పించడం మంచిదే. అయినా అధికారులు పై చర్యలు లేకుంటే తిరిగి వచ్చే వారు మళ్ళీ అక్రమాలకు పాల్పాడే అవకాశం వుంది. అందువల్ల ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రాజీవ్ నగర్ లో అక్రమాలకు పాల్పడిన, అందుకు సంహరించిన అధికారులు, సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా చేయాలని రాజీవ్ నగర్ వాసులు కోరుతున్నారు.

రాజీవ్ నగర్ స్పెషల్ డ్రైవ్ లోనైనా తప్పులు చేసిన అధికారులుపై చర్యలు ఉంటాయా..? లేదా..?
శ్రీకాళహస్తిలోని అన్నీ రాజకీయ పక్షాలకు, అధికారులకు, పాత్రికేయులకు కల్పతరువుగా మారిన రాజీవ్ నగర్ లో 2007 నుంచి జరిగిన అక్రమాలకు కారకులైన సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు లేకపోవడంతో కేవలం ప్లాట్లు కొన్నవారు, విక్రయాలకు పాల్పడిన వారు, ఇళ్ళు కట్టుకున్న పేదలకు కూటమి ప్రభుత్వంలో నిద్రపట్టడం లేదనే విమర్శలు వున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు రెండు మూడు పర్యాయాలు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జోక్యం చేసుకుని నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయడానికి మున్సిపల్, రెవిన్యూ అధికారులు,సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి రికార్డులు పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే తిరిగి మళ్ళీ స్పెషల్ డ్రైవ్ పేరుతో రాజీవ్ నగర్ కు వెళుతున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని, అక్రమాలు చేసిన వారికి, వారికి సహకరించిన అధికారులు, సిబ్బందిపై ఎక్కడున్నా జిల్లా కలెక్టర్ ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలని రాజీవ్ నగర్ వాసులు, బాధిత కుటుంబాలు కోరుతున్నారు. అలా కాకుండా కేవలం విచారణ చేసి అర్హులుకు ఇంటి పట్టాలు ఇప్పించడం మంచిదే. అయినా అధికారులు పై చర్యలు లేకుంటే తిరిగి వచ్చే వారు మళ్ళీ అక్రమాలకు పాల్పాడే అవకాశం వుంది. అందువల్ల ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రాజీవ్ నగర్ లో అక్రమాలకు పాల్పడిన, అందుకు సంహరించిన అధికారులు, సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా చేయాలని రాజీవ్ నగర్ వాసులు కోరుతున్నారు.

