రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ సిగ్గు మాలిన విధులు ..
కార్తీకమాస పవిత్ర దినాల్లో రాజమండ్రి నగర పాలక సంస్థ వారు ఎంతో ప్రాముఖ్యత గల పుష్కర ఘాట్ కు తాళలు వేసి హిందూ ధర్మాన్ని అవమానిస్తున్నారు . వారి మనోభావాలను గాయ పరుస్తున్నారు . హిందువుల పవిత్ర దినాలను కలుషితం చేస్తున్నారు ..
కార్తీకమాస పర్వ దినాల్లో రాజమండ్రి నగర పాలక సంస్థ వారు చేసిన మహా పాపం జాతీయ ద్రోహంగా బావించాలి . ఎందరో భక్తులు పుష్కర ఘాట్ కు తాళాలు వేసిన కారణంగా నిరుత్సాహంతో వెనుదిరుగుతున్నారు .
రాజమండ్రి నగర పాలక సంస్థ చేసిన మహా ద్రోహ చర్య కారణంగా భక్తులు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు . ఈ పాపం రాజమండ్రి పాలకులకు కనపడక పోవటం ఆశ్చర్యంగా వుంది .
గోదావరి పోటు మీద ఉన్నప్పటికి అందుకు అవసరమయ్యే పటిష్టమైన భద్రతా చర్యలు , సహాయక చర్యలు నిర్వహించి భక్తుల మనోభావాలకు అండగా నిలవాలి అనే కనీస జ్ఞానం కూడా రాజమండ్రి నగర పాలక సంస్థకు లేకపోవటం దురదృష్టం .
రాజమండ్రి నగర పాలక సంస్థ పనితీరు ఎలావుందంటే తుఫాన్ వుంది అంటే సముద్రానికి గోడ కట్టాలి . గోదావరికి తాళాలు వేయాలి అన్నట్టు రాజమండ్రి నగర పాలక సంస్థ పనితీరు కనపడుతుంది .
పుష్కర ఘాట్ కు కార్తీకమాస పవిత్ర దినాల్లో తాళాలు వేసి రాజమండ్రి ప్రతిష్టను రాజమండ్రి నగర పాలక సంస్థ మంటగలిపింది . తక్షణమే తప్పును సరి దిద్దుకునే చర్యలు చేపట్టాలి.
హిందువుల మనోభావాల ను రాజమండ్రి నగర పాలక సంస్థ వారు గాయపరిచినట్టు పాకిస్తాన్ వారు కూడా చేయరేమోనని అనిపిస్తుంది . హిందువుల ప్రతీకగా వున్నటు వంటి నరేంద్ర మోదీ పాలనలో జరిగిన ఈ పాపం రాజమండ్రి చరిత్రను వెంటాడుతూనే ఉంటుంది .


