రాజమండ్రి జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ-సేవా కేంద్రాన్ని శనివారం సాయంత్రం జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత గారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పౌరులు కోర్టు సంబంధిత సేవలను సులభంగా పొందేందుకు ఈ-సేవా కేంద్రం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆధునిక సాంకేతిక వనరులను వినియోగించడం ద్వారా ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన న్యాయసేవలు అందుతాయని పేర్కొన్నారు. అలాగే న్యాయవాదులు తమ వృత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి ఈ కేంద్రం తోడ్పడుతుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో 9వ అదనపు జిల్లా జడ్జి ఎం. మాధురి గారు ప్రత్యేక అతిథిగా పాల్గొన్నారు.
జిల్లా కోర్టు ఆవరణలో ప్రారంభమైన ఈ కొత్త కేంద్రం ద్వారా న్యాయ సేవల వినియోగం మరింత విస్తరించి, ప్రజలకు సమయం, శ్రమ ఆదా అవుతుందని అధికారులు తెలిపారు.


