*ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో రాజంపేట పట్టణం 3 వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్, అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ వాణిజ్య విభాగం అద్యక్షులు. రాజంపేట .
—————————–
*రాజంపేట నియోజకవర్గంలోని రాజంపేట లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్, అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అద్యక్షులు సనిశెట్టి నవీన్ కుమార్ గారు ప్రారంభించారు.*
*ఈ సందర్బంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. ముద్రించిన ,పాంప్లీట్ ను, సంతకాల సేకరణ …
*మన రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి .. కేవలం 11 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉంటే.. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో.. ఏకంగా 17 నూతన మెడికల్ కళాశాలల ను తీసుకువచ్చారని అన్నారు.*
*విద్య, వైద్యం, రెండు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు.. జగన్మోహన్ రెడ్డి గారు యత్నించారని తెలిపారు.*
• *ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్.. (పిపిపి ) మోడ్ అని చెబుతూ..అన్ని వ్యవస్థలను ప్రైవేటుకు కట్టబడుతుందన్నారు.*
• *గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు..నూతన మెడికల్ కళాశాలలో తీసుకువచ్చారనే అక్కసుతోనే.. ఈరోజు చంద్రబాబు నాయుడు వాటన్నిటిని ప్రైవేటుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు.*
• *ఈ రాష్ట్రంలో దశలవారీగా 17 మెడికల్ కళాశాలను ప్రారంభించాలనే సంకల్పంతో… జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసి..ఇప్పటికే 7 మెడికల్ కళాశాలలను పూర్తి చేశారని తెలిపారు.*
• *మెడికల్ కళాశాల అంటే.. కేవలం కళాశాల మాత్రమే కాదని.. అది ఒక వ్యవస్థలా పనిచేస్తూ..ప్రజా ఆరోగ్యానికి.. అండగా సేవలందిస్తుందని తెలిపారు .*
• *ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉందంటే.. ఆ ప్రాంతంలో ప్రజలకు ఉచిత వైద్య సేవలతో పాటు..పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు.. అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.*
• *ఈరోజు అవేమీ పట్టవన్నట్టుగా కూటమి ప్రభుత్వం.. ప్రజల ఆకాంక్షను కూడా.. లెక్కచేయకుండా మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేయడం సిగ్గుచేటన్నారు.*
• *ఈరోజు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ..కూటమి ప్రభుత్వం.. తీసుకున్న నిర్ణయాన్ని.. వైఎస్ఆర్సిపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.*
• *అందులో భాగంగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా.. వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.*
• *ఈ కార్యక్రమం ద్వారా కడప నియోజకవర్గంలో 60 వేల నుంచి.. లక్ష సంతకాల వరకు సేకరింస్తామని తెలిపారు..*
• *ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తి చేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన గవర్నర్ గారికి పంపి..కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తామన్నారు*
• *అప్పటికి ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే.. కోర్టుల ద్వారా న్యాయపోరాటం చేస్తామన్నారు.*


