ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఆదివారం సెప్టెంబర్ 14న చిట్వేలి మండలం ఎం.రాచపల్లి గ్రామంలో విద్యార్థులకు భగవద్గీత పై కాంపిటేషన్ నిర్వహించారు. 21వ తేదీ ఆదివారం సాయంత్రం భగవద్గీతను అనర్గళంగా చూసి చదివిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్వేలి గ్రామానికి చెందిన శ్రీ రాయిపెద్ది సుబ్రహ్మణ్యం శర్మ హాజరయ్యారు. ముందుగా ఆయనను గ్రామ ప్రజలు, యువత కలిసి శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం భగవద్గీత ను అనర్గళంగా చూసి చదివిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో కలిసి వారిని బ్రాహ్మణ శ్రీ సుబ్రహ్మణ్యం శర్మ ఘనంగా సత్కరించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మొదటి బహుమతి చొక్కారాజు మోహన్ రాజు -రుపినమ్మల కుమార్తె యశస్విని అందుకున్నారు, రెండవ బహుమతి వెలిగిండ్ల త్యాగరాజు కుమార్తె కారుణ్య, మూడవ బహుమతి పాండురాజు నరసింహరాజు -సావిత్రమ్మ ల కుమారుడు సంతోష్ రాజు బహుమతులు అందుకున్నారు. వారం వారం క్రమం తప్పకుండా భగవద్గీత క్లాసులకు హాజరైన విద్యార్థులు వెలిగిండ్ల రెడ్డయ్య రాజు, పాండురాజు మోక్షిత, పాండు రాజు సంతోష్ రాజు, పాండురాజు లక్ష్మి, రాఘవ రాజు యోగేశ్వర్ రాజుకు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం శర్మ మాట్లాడుతూ చిట్వేలి మండలం తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన మా శిష్యుడు రామ్మోహన్ ఎంతో ఓపికతో ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవలు నిర్వహిస్తున్నారని అటువంటి వారికి నేను ఎల్లప్పుడూ సహాయంగా ఉండి వారిని ఆశీర్వదిస్తానని అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో భగవద్గీతను ప్రతిరోజు ఆచరిస్తే చిన్నప్పటి నుంచి పిల్లలకు బుద్ధి, గుణం, సంస్కారం, పెద్దలపట్ల గౌరవం, వంటివి అలవాటు అవుతాయని అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో ప్రజలు టీవీ సీరియల్స్ కి అలవాటైపోయారని అది మంచి అలవాటు కాదని. పిల్లలతో పాటు మీరు కూడా భగవద్గీతను చదివిన, విన్న ఎంతో పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మేల్కొని టీవీ సీరియల్స్, సినిమాలకు అలవాటు పడకుండా మన హిందూ సంప్రదాయాలు పట్ల గౌరవంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తదుపరి రాచపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గురువు రామ్మోహన్ ను ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గురువు రామ్మోహన్ మాట్లాడుతూ రాచపల్లి గ్రామంలో చాలామంది విద్యార్థులు ఉన్నారని కేవలం 13 మంది హాజరు కావడం చాలా బాధ కలిగించిందని ఈసారైనా తప్పకుండా గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులు అర్థం చేసుకొని భగవద్గీత క్లాసులకు పంపించమని ఆయన గ్రామంలోని పెద్దలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ధర్మనిధి సభ్యులు గురువు రామ్మోహన్, మన్నూరు శేఖర్ రెడ్డి, చెర్లోపల్లి గ్రామానికి చెందిన ధర్మనిధి సభ్యులు, గ్రామంలోని పెద్దలు, యువత, మహిళలు, భగవద్గీత విద్యార్థులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

రాచపల్లి గ్రామంలో భగవద్గీత పోటీలలో సత్తా చాటిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం
ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత ఆదివారం సెప్టెంబర్ 14న చిట్వేలి మండలం ఎం.రాచపల్లి గ్రామంలో విద్యార్థులకు భగవద్గీత పై కాంపిటేషన్ నిర్వహించారు. 21వ తేదీ ఆదివారం సాయంత్రం భగవద్గీతను అనర్గళంగా చూసి చదివిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ, బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చిట్వేలి గ్రామానికి చెందిన శ్రీ రాయిపెద్ది సుబ్రహ్మణ్యం శర్మ హాజరయ్యారు. ముందుగా ఆయనను గ్రామ ప్రజలు, యువత కలిసి శాలువా కప్పి పూలమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం భగవద్గీత ను అనర్గళంగా చూసి చదివిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులతో కలిసి వారిని బ్రాహ్మణ శ్రీ సుబ్రహ్మణ్యం శర్మ ఘనంగా సత్కరించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా మొదటి బహుమతి చొక్కారాజు మోహన్ రాజు -రుపినమ్మల కుమార్తె యశస్విని అందుకున్నారు, రెండవ బహుమతి వెలిగిండ్ల త్యాగరాజు కుమార్తె కారుణ్య, మూడవ బహుమతి పాండురాజు నరసింహరాజు -సావిత్రమ్మ ల కుమారుడు సంతోష్ రాజు బహుమతులు అందుకున్నారు. వారం వారం క్రమం తప్పకుండా భగవద్గీత క్లాసులకు హాజరైన విద్యార్థులు వెలిగిండ్ల రెడ్డయ్య రాజు, పాండురాజు మోక్షిత, పాండు రాజు సంతోష్ రాజు, పాండురాజు లక్ష్మి, రాఘవ రాజు యోగేశ్వర్ రాజుకు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం శర్మ మాట్లాడుతూ చిట్వేలి మండలం తిమ్మాయపాలెం గ్రామానికి చెందిన మా శిష్యుడు రామ్మోహన్ ఎంతో ఓపికతో ధర్మనిధి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవలు నిర్వహిస్తున్నారని అటువంటి వారికి నేను ఎల్లప్పుడూ సహాయంగా ఉండి వారిని ఆశీర్వదిస్తానని అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో భగవద్గీతను ప్రతిరోజు ఆచరిస్తే చిన్నప్పటి నుంచి పిల్లలకు బుద్ధి, గుణం, సంస్కారం, పెద్దలపట్ల గౌరవం, వంటివి అలవాటు అవుతాయని అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో ప్రజలు టీవీ సీరియల్స్ కి అలవాటైపోయారని అది మంచి అలవాటు కాదని. పిల్లలతో పాటు మీరు కూడా భగవద్గీతను చదివిన, విన్న ఎంతో పుణ్యఫలం లభిస్తుందని అన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ మేల్కొని టీవీ సీరియల్స్, సినిమాలకు అలవాటు పడకుండా మన హిందూ సంప్రదాయాలు పట్ల గౌరవంగా ఉండాలని ఈ సందర్భంగా ప్రతి గ్రామంలోని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. తదుపరి రాచపల్లి గ్రామ ప్రజల ఆధ్వర్యంలో గురువు రామ్మోహన్ ను ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా గురువు రామ్మోహన్ మాట్లాడుతూ రాచపల్లి గ్రామంలో చాలామంది విద్యార్థులు ఉన్నారని కేవలం 13 మంది హాజరు కావడం చాలా బాధ కలిగించిందని ఈసారైనా తప్పకుండా గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులు అర్థం చేసుకొని భగవద్గీత క్లాసులకు పంపించమని ఆయన గ్రామంలోని పెద్దలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ధర్మనిధి సభ్యులు గురువు రామ్మోహన్, మన్నూరు శేఖర్ రెడ్డి, చెర్లోపల్లి గ్రామానికి చెందిన ధర్మనిధి సభ్యులు, గ్రామంలోని పెద్దలు, యువత, మహిళలు, భగవద్గీత విద్యార్థులు, పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

