పువ్వాడ నాగేంద్ర కుమార్
(పున్నమి తెలంగాణ ప్రతినిధి)
ఖమ్మం నియోజకవర్గంలోని రఘునాథపాలెం మండల రైతు వేదికలో నిర్వహించిన ఆయిల్ ఫామ్ సాగుపై అవగాహన సదస్సులో డ
కాంగ్రెస్ యువ నేత యుగంధర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఆయిల్ ఫామ్ పంట సాగుకు ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థల నుంచి మంచి ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. గోద్రెజ్ కర్మాగారం త్వరలో ప్రారంభమవుతుందని, దీంతో రైతులకు పెద్ద ఎత్తున లాభాలు దక్కనున్నాయని పేర్కొన్నారు.
మండలంలోని రైతులందరూ ఆయిల్ ఫామ్ పంటను వేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గోద్రెజ్ మేనేజర్, మార్కెట్ యార్డ్ చైర్మన్, రైతు సంఘం నాయకులు, మండల నాయకులు, రైతు సోదరులు పాల్గొన్నారు.


